గస్తీకి వచ్చి ఫ్యాన్ చోరీ
బిహార్లోని భాగల్పుర్ జిల్లాలో పోలీసులే దొంగతనానికి పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నైట్ పెట్రోలింగ్లో ఉన్న పోలీసులు.. వాహనాన్ని ఆపి ఓ ఇంటి ముందు ఉన్న టేబుల్ ఫ్యాన్ను ఎత్తుకెళ్లారు. ఆ దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
బిహార్లో అడ్డంగా దొరికిపోయిన పోలీసులు
బిహార్లోని భాగల్పుర్ జిల్లాలో పోలీసులే దొంగతనానికి పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నైట్ పెట్రోలింగ్లో ఉన్న పోలీసులు.. వాహనాన్ని ఆపి ఓ ఇంటి ముందు ఉన్న టేబుల్ ఫ్యాన్ను ఎత్తుకెళ్లారు. ఆ దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. సెప్టెంబర్ 26న అర్ధరాత్రి ధోల్బాజా ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇంటి యజమాని సుబోధ్ చౌదరి.. తొలుత చుట్టుపక్కలవారిని అడిగాడు. అనంతరం సీసీటీవీ దృశ్యాలను పరిశీలించాడు. దీంతో పోలీసు దొంగలు దొరికిపోయారు. వెంటనే సుబోధ్ పోలీసుల వద్దకు వెళ్లాడు. తొలుత.. అలాంటిదేమీ లేదంటూ బుకాయించిన పోలీసులు, స్టేషన్ నుంచి వెళ్లిపోవాలని బెదిరించారు. అనంతరం సుబోధ్ సీసీటీవీ దృశ్యాలను చూపించడంతో ఆశ్చర్యపోయారు. ఫ్యాన్ను తిరిగి ఇచ్చేశారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ విచారణకు ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!