మళ్లీ కలం పట్టిన సాయినాథ్‌

మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో పేదరికంపై క్షేత్రస్థాయిలో పరిశీలించి ‘ఎవ్రీ బడీ లవ్స్‌ ఏ గుడ్‌ డ్రాట్‌’ పుస్తకం రాసిన ప్రముఖ రచయిత, జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్‌ రెండు దశాబ్దాల తరువాత మరో పుస్తకాన్ని వెలువరిస్తున్నారు.

Published : 03 Oct 2022 05:11 IST

 విస్మృత పోరాటయోధులపై ‘ది లాస్ట్‌ హీరోస్‌’ పేరుతో పుస్తకం

వచ్చే నెల 21న విడుదల చేసేందుకు సన్నాహాలు

దిల్లీ: మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో పేదరికంపై క్షేత్రస్థాయిలో పరిశీలించి ‘ఎవ్రీ బడీ లవ్స్‌ ఏ గుడ్‌ డ్రాట్‌’ పుస్తకం రాసిన ప్రముఖ రచయిత, జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్‌ రెండు దశాబ్దాల తరువాత మరో పుస్తకాన్ని వెలువరిస్తున్నారు. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న రైతులు, కార్మికులు, గృహిణులు, కళాకారులు తదితరుల అవిశ్రాంత పోరాటాన్ని ఇందులో వివరిస్తున్నారు. ఈ పుస్తకం వచ్చే నెల 21న విడుదల కానుంది. విస్మృత పోరాటయోధుల గురించి ‘ది లాస్ట్‌ హీరోస్‌’ పేరుతో ఆయన రాసిన పుస్తకాన్ని పెంగ్విన్‌ సంస్థ ప్రచురిస్తోంది. ‘దేశ విముక్తి కోసం పోరాడిన ఈ వీరులు 5, 6 ఏళ్ల తరువాత మనతో జీవించి ఉండరు. కొత్త తరానికి వారి పరిచయం లేదు. మాట్లాడడం, చూసే భాగ్యం కూడా లేదు. మన స్వాతంత్య్ర ఉద్యమంపై యువతకు పరిజ్ఞానాన్ని పెంచడమే పుస్తక రచనకు ప్రేరేపించింది. స్వేచ్ఛ కోసం ఎందరో త్యాగాలు చేశారు. ఆ సమయంలో భిన్నత్వంలో ఏకత్వం ప్రస్ఫుటమైంది. దేశవ్యాప్తంగా ఉన్న క్షేత్రస్థాయి యోధులను గుర్తు చేసుకోవడమే ఈ పుస్తకం లక్ష్యం’ అని సాయినాథ్‌ వివరించారు. ఆయన తొలి పుస్తకం విశేష ఆదరణ పొంది 56వ ప్రచురణకు వెళ్లింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని