న్యాయస్థానంపై నమ్మకం ఉంది: గాలి జనార్దన్‌రెడ్డి

గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులు 12 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని వాటిని త్వరగా విచారించాలని న్యాయస్థానంలో దరఖాస్తు సమర్పించినట్లు కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి చెప్పారు.

Updated : 04 Oct 2022 05:50 IST

బళ్లారి, న్యూస్‌టుడే: గనుల అక్రమ తవ్వకాలకు సంబంధించిన కేసులు 12 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని వాటిని త్వరగా విచారించాలని న్యాయస్థానంలో దరఖాస్తు సమర్పించినట్లు కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి చెప్పారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా సోమవారం బళ్లారి కనక దుర్గమ్మ దర్శనానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘న్యాయస్థానాలపై నాకు నమ్మకం ఉంది. 12 ఏళ్లుగా బయట కనిపించడం లేదు. కుటుంబం, దేవుని ధ్యానంలో జీవనం సాగిస్తున్నాను. నేను బళ్లారిలో ఉండకూడదని కొంత మంది ప్రయత్నాలు చేస్తున్నారు. న్యాయస్థానం ఆదేశాలతో 14నెలలుగా బళ్లారిలోనే ఉంటున్నాను. బళ్లారిలో ఉండకూడదని న్యాయస్థానంలో సీబీఐదరఖాస్తు సమర్పించింది. త్వరలో మీ ముందుకు వస్తాను’ అని వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని