Number Plate Rules: నంబర్ ప్లేట్ నిబంధనలకు సవరణలు.. ముసాయిదా విడుదల చేసిన కేంద్ర రవాణాశాఖ
వాహనాలకు బీహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్ విధానం తీసుకురావాలని నిర్ణయించిన కేంద్ర రహదారి, రవాణాశాఖ ఆ నిబంధనల అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించడానికి కొన్ని సవరణలు ప్రతిపాదించింది.
ఈనాడు, దిల్లీ: వాహనాలకు బీహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్ విధానం తీసుకురావాలని నిర్ణయించిన కేంద్ర రహదారి, రవాణాశాఖ ఆ నిబంధనల అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించడానికి కొన్ని సవరణలు ప్రతిపాదించింది. సంబంధిత ముసాయిదా నోటిఫికేషన్ను శుక్రవారం విడుదల చేసింది. దీని ప్రకారం.. బీహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్ ఉన్న వాహనాలను ఇతరులకు బదిలీ చేయొచ్చు. కొత్త యజమాని బీహెచ్ సిరీస్ పొందడానికి అర్హుడై ఉంటే అదే నంబర్ ప్లేట్తో వాహనాన్ని నడుపుకోవచ్చు. ఈ వాహనాన్ని అనర్హులకు బదిలీ చేస్తే మాత్రం బీహెచ్ సిరీస్ నంబర్ ప్లేట్ స్థానంలో సాధారణ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో ఉన్న నిబంధనల ప్రకారం మోటార్ వాహన పన్ను చెల్లించాలి. ఓ వ్యక్తి బీహెచ్ సిరీస్ రిజిస్ట్రేషను పొందే అర్హత సాధిస్తే.. ఆ వ్యక్తి చేతిలో సాధారణ రిజిస్ట్రేషనుతో ఉన్న వాహనాన్ని బీహెచ్ సిరీస్కు మార్చుకోడానికి కొత్త నిబంధనల కింద అనుమతిస్తారు. ఇందుకు వర్తించే పన్నులు చెల్లిస్తే సరిపోతుంది. బీహెచ్ సిరీస్ రిజిస్ట్రేషను కోసం వినియోగదారులు తాము నివసిస్తున్నచోట కానీ, లేదంటే పనిచేసేచోట కానీ దరఖాస్తు చేసుకోవచ్చు. వర్కింగ్ సర్టిఫికెట్ జారీని మరింత కఠినతరం చేశారు. ఇదివరకు ఫలానా వ్యక్తి తమ కార్యాలయంలో పనిచేస్తున్నారని చెప్పి ఓ సంస్థ అధీకృత లేఖ ఇస్తే సరిపోయేది. ఇది దుర్వినియోగమయ్యే అవకాశం ఉందన్న కారణంగా ఇప్పుడు సంస్థ పేరు, దాని రిజిస్ట్రేషన్ నంబర్, జీఎస్టీ నంబర్, పాన్, చిరునామా, ఈ-మెయిల్ అడ్రస్ అడుగుతారు. అలాగే ఉద్యోగి నుంచి గుర్తింపు కార్డు, యూనిక్ అకౌంట్ నంబర్, మొబైల్ నంబర్, ఈ-మెయిల్, పాన్ నంబర్ వివరాలనూ పొందుపరచాల్సి ఉంటుంది. ఈ ముసాయిదా నిబంధనలపై సూచనలు చేయదలచుకుంటే 30 రోజుల్లోపు కేంద్ర రహదారి రవాణాశాఖకు పంపవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్