Tamil Nadu: 13 కి.మీ. సముద్రంలో ఈది.. తమిళనాడు చేరిన శ్రీలంక యువకుడు

శ్రీలంక నుంచి తన కుటుంబంతో పడవలో సముద్ర మార్గాన తమిళనాడు తీరానికి చేరుకునే క్రమంలో ఓ యువకుడు సముద్రంలోకి దూకేశాడు. రామేశ్వరం తీరం వరకు సుమారు 13 కి.మీ. ఈదుకుంటూ వచ్చిన 24 ఏళ్ల ఆ యువకుడిని ఆదివారం అదుపులోకి తీసుకుని అక్కడి తీర గస్తీదళాలు విచారణ ప్రారంభించాయి.

Updated : 11 Oct 2022 08:55 IST

వేలచ్చేరి, న్యూస్‌టుడే: శ్రీలంక నుంచి తన కుటుంబంతో పడవలో సముద్ర మార్గాన తమిళనాడు తీరానికి చేరుకునే క్రమంలో ఓ యువకుడు సముద్రంలోకి దూకేశాడు. రామేశ్వరం తీరం వరకు సుమారు 13 కి.మీ. ఈదుకుంటూ వచ్చిన 24 ఏళ్ల ఆ యువకుడిని ఆదివారం అదుపులోకి తీసుకుని అక్కడి తీర గస్తీదళాలు విచారణ ప్రారంభించాయి. అతడి నుంచి గడువు ముగిసిన శ్రీలంక పాస్‌పోర్టును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు సోమవారం ప్రకటించారు. శ్రీలంకలోని తలైమన్నార్‌ నుంచి వచ్చిన ఈ వ్యక్తి వెంట బోటులో అతని భార్య, ముగ్గురు పిల్లలు, మరో వ్యక్తి ఉన్నారని తెలిపారు. వీరిని రామనాథపురం జిల్లా మండపం క్యాంపులో ఉంచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని