బస్టాండ్లో పాఠశాల విద్యార్థినికి తాళి.. అక్షింతలు వేసి శుభాకాంక్షలు చెప్పిన విద్యార్థులు
పాఠశాల విద్యార్థినికి కళాశాల విద్యార్థి తాళి కట్టిన వీడియో సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లా చిదంబరంలోని గాంధీ విగ్రహం వద్ద పరిసర గ్రామాలకు వెళ్లేందుకు బస్టాండ్ ఉంది.
ఫేస్బుక్లో వీడియో పెట్టిన వ్యక్తి అరెస్టు
చెన్నై (ప్యారిస్), న్యూస్టుడే: పాఠశాల విద్యార్థినికి కళాశాల విద్యార్థి తాళి కట్టిన వీడియో సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లా చిదంబరంలోని గాంధీ విగ్రహం వద్ద పరిసర గ్రామాలకు వెళ్లేందుకు బస్టాండ్ ఉంది. ఇక్కడ పాఠశాల యూనిఫాం వేసుకొని ఓ బాలికకు పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న విద్యార్థి తాళి కట్టాడు. పక్కనే ఉన్న విద్యార్థులు వారికి అక్షింతలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థిని ప్లస్టూ చదువుతున్నట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమంలో చూసిన చిదంబరం పోలీసులు ఆ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పోలీస్స్టేషన్కు పిలిపించి విచారించారు. మరోవైపు బాలల సంక్షేమ అధికారి రమ్య నేతృత్వంలోని అధికారుల బృందం దీనిపై విచారణ జరుపుతోంది. ఈ వ్యవహారంలో ఫేస్బుక్లో వీడియో పోస్టు చేసిన బాలాజీ గణేశ్ని మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. అకస్మాత్తుగా అనారోగ్యానికి గురికావడంతో నిందితుడిని ఆస్పత్రికి తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు