Vande Bharat trains: ఇక ‘వందే భారత్’ సరకు రవాణా రైళ్లు
దేశంలో మూడు వందే భారత్ రైళ్లు ఇప్పటికే పట్టాలపై పరుగులు తీస్తుండగా.. నాలుగో రైలును గురువారం ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో త్వరలోనే సరకు రవాణాకూ ‘వందే భారత్’ తరహా రైళ్లను తీసుకురావాలని రైల్వే శాఖ యోచిస్తోంది.
తొలిగా దిల్లీ-ముంబయి మధ్య అందుబాటులోకి
దిల్లీ: దేశంలో మూడు వందే భారత్ రైళ్లు ఇప్పటికే పట్టాలపై పరుగులు తీస్తుండగా.. నాలుగో రైలును గురువారం ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో త్వరలోనే సరకు రవాణాకూ ‘వందే భారత్’ తరహా రైళ్లను తీసుకురావాలని రైల్వే శాఖ యోచిస్తోంది. తక్కువ సమయంలో సరకు రవాణా చేసేందుకుగానూ ఈ హైస్పీడ్ పార్సిల్ రైలు సేవలను మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు రైల్వే వర్గాల సమాచారం. తొలి దశలో భాగంగా దిల్లీ ఎన్సీఆర్ నుంచి ముంబయి వరకు సరకు రవాణా రైలును అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా ఈ రైళ్లను తయారుచేస్తున్నారు. రైలులోని ఒక్కో కోచ్లో 1,800 మిల్లీమీటర్ల వెడల్పుతో ఉండే ఆటోమేటిక్ స్లైడింగ్ ప్లగ్ డోర్లు ఉంటాయట. పార్సిళ్లను సులువుగా లోడింగ్ / అన్లోడింగ్ చేసేలా రోలర్ ఫ్లోర్ సిస్టమ్ ఏర్పాటు చేస్తారట.
నేడు నాలుగో రైలును ప్రారంభించనున్న ప్రధాని
ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం నాలుగో వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. దిల్లీ, హిమాచల్ప్రదేశ్లోని అందౌరా రైల్వే స్టేషన్ మధ్య నడిచే ఈ రైలును.. ఉనా జిల్లాలో గురువారం ప్రధాని జెండా ఊపి ప్రారంభిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.