SBI: లోన్‌ ఇవ్వకుంటే.. బ్యాంకును పేల్చేస్తా.. ఎస్‌బీఐకు బెదిరింపు ఫోన్‌ కాల్‌

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసి బెదిరించాడు.

Updated : 16 Oct 2022 06:48 IST

ముంబయి: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)కు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ చేసి బెదిరించాడు. తనకు రూ.10 లక్షల రుణం మంజూరు చేయాలని, లేకుంటే బ్యాంకు ఛైర్మన్‌ దినేశ్‌ ఖారాను అపహరించి, హతమార్చడమే కాకుండా... బ్యాంకు కార్పొరేట్‌ కార్యాలయాన్ని పేల్చేస్తానంటూ హెచ్చరించాడు. ఈ మేరకు దక్షిణ ముంబయిలోని నారీమన్‌ పాయింట్‌లో ఉన్న ఎస్‌బీఐ ఛైర్మన్‌ వ్యక్తిగత సహాయకుని కార్యాలయానికి బుధవారం ఫోన్‌ వచ్చింది. ఈ విషయమై బ్యాంక్‌ సెక్యూరిటీ మేనేజర్‌ అజయ్‌ కుమార్‌ శ్రీవాస్తవ.. మెరైన్‌ డ్రైవ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమ బెంగాల్‌ నుంచి ఈ కాల్‌ వచ్చినట్టు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. నిందితుడిని పట్టుకునేందుకు ఓ బృందాన్ని అక్కడికి పంపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని