EPFO: పింఛన్ పథకం నుంచీ డబ్బులు వెనక్కి
ఆరు నెలల కంటే తక్కువ సర్వీసు మాత్రమే మిగిలిఉన్న ఖాతాదారులను తమ ‘ఉద్యోగుల పింఛన్ పథకం 1995’ (ఈపీఎస్-95) నుంచి డబ్బులు ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) నిర్ణయించింది.
ఈపీఎఫ్ఓ నిబంధనల సడలింపు
దిల్లీ: ఆరు నెలల కంటే తక్కువ సర్వీసు మాత్రమే మిగిలిఉన్న ఖాతాదారులను తమ ‘ఉద్యోగుల పింఛన్ పథకం 1995’ (ఈపీఎస్-95) నుంచి డబ్బులు ఉపసంహరించుకునేందుకు అనుమతించాలని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ఓ) నిర్ణయించింది. ప్రస్తుతం 6 నెలల కంటే తక్కువ సర్వీసు మిగిలి ఉన్నవారు తమ భవిష్య నిధి(పీఎఫ్) ఖాతా నుంచి మాత్రమే డబ్బులు వెనక్కి తీసుకోవడానికి అనుమతులున్నాయి. ఈపీఎస్ ఖాతాదారులకూ ఈ వెసులుబాటు ఇవ్వాలని సోమవారం కేంద్ర కార్మిక మంత్రి భూపేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈపీఎఫ్ఓ నిర్ణయాధికార సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్(సీబీటీ) 232వ సమావేశం సిఫారసు చేసినట్లు కార్మికశాఖ వెల్లడించింది.
వీరికి అధిక పింఛన్ వస్తుంది!
34 ఏళ్ల కంటే ఎక్కువ కాలంపాటు పథకంలో ఉన్నవారికి అందుకు తగ్గట్లుగా పింఛన్ ప్రయోజనాలను ఇవ్వడానికీ బోర్డు సిఫారసు చేసింది. దీనివల్ల పదవీ విరమణ ప్రయోజనాలను నిర్ణయించే సమయంలో అధిక పింఛన్ పొందడానికి వీలవుతుంది. ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్(ఈటీఎఫ్) యూనిట్లలో ఉన్న పెట్టుబడులను ఉపసంహరించుకునే రిడమ్షన్ పాలసీకి సైతం అనుమతినిచ్చారు. ప్రపంచస్థాయి సామాజిక భద్రత అందించేందుకు, అంతర్జాతీయ ప్రమాణాలను చేరుకునేందుకు వీలు కల్పించే కీలక వ్యూహాలు, చర్యలపైనా బోర్డు చర్చలు చేపట్టినట్లు కార్మికశాఖ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్
-
ఐటీ నోటీసులపై దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తల మాటలు విన్నారు: సీఎం రేవంత్రెడ్డి
-
టీసీఎస్లో 3.5 లక్షల మంది ఉద్యోగులకు జనరేటివ్ ఏఐలో శిక్షణ