Electric kick: పాత పెట్రోల్ వాహనాలకు.. ఎలక్ట్రిక్ కిక్
రాజస్థాన్లోని జైపుర్కు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. పాత పెట్రోల్ స్కూటర్, బైక్లను ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తోంది.
రాజస్థాన్లోని జైపుర్కు చెందిన ఓ స్టార్టప్ కంపెనీ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. పాత పెట్రోల్ స్కూటర్, బైక్లను ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తోంది. జోధ్పుర్లో జరుగుతున్న హరే డిజిఫెస్ట్లో ఈ వాహనాన్ని ఆవిష్కరించింది. ‘‘పాత స్కూటర్ను, కొత్త ఎలక్ట్రిక్ వాహనంగా ఎందుకు మార్చకూడదు అనే ఆలోచన నాలో వచ్చింది. వెంటనే ఈ విషయాన్ని నా పిల్లలతో చెప్పాను. వారు బాగా శ్రమించి పాత స్కూటర్ను ఎలక్ట్రిక్ వాహనంగా మార్చారు. ఇది విజయవంతం కావడంతో మరిన్ని పాత మోటార్ సైకిళ్లను కొత్త ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాం’’ అని కంపెనీ వ్యవస్థాపకురాలు మధు కిరోడీ తెలిపారు. ఇందుకు రూ. 30వేలు ఖర్చు అవుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ వాహనాన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని.. ఇందుకు దాదాపు రూ.6 ఖర్చవుతుందని మధు కిరోడీ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ మద్యం స్కామ్.. సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి
-
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
-
4 రోజుల నష్టాలకు బ్రేక్.. 599 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి