అల్లుడి పెద్ద గిల్లుడు!
పిల్లనిచ్చిన మామ ఆస్తికే ఎసరు పెట్టాడో అల్లుడు. ఏకంగా రూ.100 కోట్లకుపైగా స్థిర, చరాస్తులు కొల్లగొట్టేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. దుబాయ్లో ఉండే అబ్దుల్ లాహీర్ హసన్ అనే వ్యాపారవేత్త.. కేరళకు చెందిన మహమ్మద్ హఫీజ్కు 2017లో తన కుమార్తెనిచ్చి వివాహం జరిపించారు.
మామకు చెందిన రూ.107 కోట్ల సంపద స్వాహా
తిరువనంతపురం: పిల్లనిచ్చిన మామ ఆస్తికే ఎసరు పెట్టాడో అల్లుడు. ఏకంగా రూ.100 కోట్లకుపైగా స్థిర, చరాస్తులు కొల్లగొట్టేశాడు. పోలీసుల వివరాల ప్రకారం.. దుబాయ్లో ఉండే అబ్దుల్ లాహీర్ హసన్ అనే వ్యాపారవేత్త.. కేరళకు చెందిన మహమ్మద్ హఫీజ్కు 2017లో తన కుమార్తెనిచ్చి వివాహం జరిపించారు. ఆ సమయంలో వెయ్యి సవర్ల బంగారాన్ని తన బిడ్డకు బహుమతిగా ఇచ్చారు. ఈ క్రమంలోనే మామ ఆస్తిపై కన్నేసిన అల్లుడు.. క్రమంగా మామ ఆస్తులను తన పేరు మీద మార్చుకోవడం ప్రారంభించాడు. ఇలా సుమారు రూ.107 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను కాజేశాడు. అల్లుడి మోసాన్ని గ్రహించిన హసన్.. మూడు నెలల క్రితమే కేరళలోని అలువ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయినా ఇప్పటి వరకూ పరారీలో ఉన్న నిందితుడిని అరెస్టు చేయడంలో వారు విఫలమైనట్లు ఆయన ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్