యుద్ధాలు వద్దు.. సవాళ్లు ఎదుర్కొందాం
మిగతా దేశాలకన్నా ఏవో కొన్ని దేశాలు అధికమనే భావనను భారత్ ఒప్పుకోదని, అలాంటి ప్రపంచ వ్యవస్థను తాము కోరుకోవడం లేదని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్
దిల్లీ: మిగతా దేశాలకన్నా ఏవో కొన్ని దేశాలు అధికమనే భావనను భారత్ ఒప్పుకోదని, అలాంటి ప్రపంచ వ్యవస్థను తాము కోరుకోవడం లేదని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. భారత నౌకాదళం ఏటా నిర్వహించే ఇండో - పసిఫిక్ ప్రాంతీయ సంప్రదింపుల సభ (ఐపీఆర్డీ) బుధవారం నుంచి ఇక్కడ జరుగుతోంది. ముగింపు రోజైన శుక్రవారం రాజ్నాథ్ ప్రసంగించారు. పరస్పర ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ.. ఉగ్రవాదం, వాతావరణ తీవ్ర మార్పుల నిరోధానికి ప్రపంచ దేశాలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇటీవల బాలిలో జరిగిన జీ 20 సదస్సులో యుద్ధాలకు రోజులు చెల్లిపోయాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించడాన్ని ఆయన ఉటంకించారు. కొవిడ్ సహా ఎన్నో సమస్యలతో ప్రపంచం అతలాకుతలం అవుతున్నదనీ, ఈ సమయంలో యుద్ధాలకు దిగడం కాకుండా అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా సవాళ్లను ఎదుర్కోవాలన్నారు. ఇండో - పసిఫిక్ స్వేచ్ఛా మండలంగా, పరస్పరం ఆమోదనీయ నిబంధనల ఆధారంగా నిలవడం ఈ ప్రాంతమే కాక యావత్ ప్రపంచం ఆర్థికంగా పురోగమించడానికి దోహదపడుతుందన్నారు. భారత నౌకా దళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన ప్రసంగంలో.. భారత్కు సముద్ర జలాల్లో ఎదురవుతున్న ముప్పులను తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్