గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఈజిప్ట్‌ అధ్యక్షుడు!

జనవరిలో జరగనున్న భారత గణతంత్ర వేడుకలకు ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌-సిసి ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉంది.

Published : 27 Nov 2022 03:09 IST

దిల్లీ: జనవరిలో జరగనున్న భారత గణతంత్ర వేడుకలకు ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌-సిసి ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉంది. విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌ గత నెలలో కైరోలో పర్యటించిన సందర్భంగా అబ్దెల్‌ ఫతాను భారత్‌ రావాల్సిందిగా అధికారికంగా ఆహ్వానించినట్లు సమాచారం. గణతంత్ర వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు ముఖ్య అతిథిగా వస్తే ఇదే తొలిసారి అవుతుంది. కరోనా కారణంగా 2021, 2022 గణతంత్ర వేడుకలకు విదేశీ ప్రముఖులను ముఖ్య అతిథులుగా భారత్‌ ఆహ్వానించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని