సెల్ఫోన్ టవర్ ఎత్తుకెళ్లిన దొంగలు
బిహార్లో ఓ దొంగల ముఠా పట్టపగలే సెల్ఫోన్ టవర్ను చోరీ చేసింది. మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ అధికారులుగా నటించిన ముఠా.. సెల్ టవర్ విడి భాగాలను ఎత్తుకెళ్లింది.
బిహార్లో ఓ దొంగల ముఠా పట్టపగలే సెల్ఫోన్ టవర్ను చోరీ చేసింది. మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ అధికారులుగా నటించిన ముఠా.. సెల్ టవర్ విడి భాగాలను ఎత్తుకెళ్లింది. ఈ ఘటన పట్నాలోని గార్డెన్బాగ్లో చోటుచేసుకుంది. కచ్చి తలాబ్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సెల్ టవర్కు కొన్ని నెలలుగా ఓ కంపెనీ అద్దె చెల్లించడం లేదు. ఈ విషయం తెలుసుకున్న 10-15 మందితో కూడిన దొంగల ముఠా టవర్ను దొంగిలించడానికి ప్రణాళిక రచించింది. ఈ క్రమంలో టవర్ ఉన్న స్థలం యజమానితో.. తాము సర్వీస్ ప్రొవైడర్ అధికారులమని.. కంపెనీ నష్టాల్లో ఉన్నందున అద్దె చెల్లించలేకపోతున్నామని చెప్పింది. అందుకే టవర్ను తొలగించాలనుకుంటున్నట్లు చెప్పగా అందుకు భూమి యజమాని అంగీకరించాడు. దీంతో ఆ ముఠా వెంటనే టవర్ను నేలమట్టం చేసి.. విడి భాగాలను తీసుకెళ్లింది.
- ఈటీవీ భారత్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.