‘జమాతే ఇస్లామీ’ సంస్థ రూ.90 కోట్ల ఆస్తుల స్వాధీనం
నిషేధిత సంస్థ ‘జమాతే ఇస్లామీ’ ఆస్తులపై స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎస్ఐఏ) దృష్టిపెట్టింది. ఆ సంస్థకు జమ్మూ-కశ్మీర్లో ఉన్న దాదాపు 200 ఆస్తులను ఇప్పటికే గుర్తించింది.
ఇంటర్నెట్డెస్క్: నిషేధిత సంస్థ ‘జమాతే ఇస్లామీ’ ఆస్తులపై స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎస్ఐఏ) దృష్టిపెట్టింది. ఆ సంస్థకు జమ్మూ-కశ్మీర్లో ఉన్న దాదాపు 200 ఆస్తులను ఇప్పటికే గుర్తించింది. అనంత్నాగ్ జిల్లాలో ఆ సంస్థకు సంబంధించిన 11 ప్రధాన ఆస్తులను సీజ్ చేసింది. వీటి విలువ సుమారు రూ.90 కోట్లు ఉంటుందని అంచనా. ఆ రాష్ట్రంలో ఉగ్రవాదం, వేర్పాటు వాదాలను జమాతే ప్రోత్సహిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ సంస్థ ఆస్తులపై ఎస్ఐఏ ఆపరేషన్ చేపట్టింది. శనివారం భారీ ఎత్తున పోలీసు దళాల సాయంతో దాడులు చేసింది. ఈ నెల మొదట్లో షోపియాన్ జిల్లాలో జమాతేకు చెందిన తొమ్మిది ఆస్తులను గుర్తించి సీజ్ చేశారు. వీటిల్లో రెండు పాఠశాల భవనాలు కూడా ఉన్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
ఆక్సిటోసిన్ లవ్ హార్మోన్ కాదా?.. శాస్త్రవేత్తల పరిశోధనల్లో కీలక విషయాలు..
-
Politics News
Bachula Arjunudu: తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడికి తీవ్ర అస్వస్థత
-
Politics News
Andhra News: ప్రభుత్వ ఉద్యోగివా.. వైకాపా కార్యకర్తవా?
-
India News
మైనర్లను పెళ్లాడిన వారికి కటకటాలే.. వేలమంది భర్తలకు శిక్ష తప్పదు: అస్సాం సీఎం హెచ్చరిక
-
Politics News
Vatti Vasanth Kumar: మాజీ మంత్రి వట్టి వసంతకుమార్ కన్నుమూత
-
India News
Mughal Garden: మొగల్ గార్డెన్స్ ఇక.. ‘అమృత్ ఉద్యాన్’