గణతంత్ర వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు

జనవరిలో జరగనున్న భారత గణతంత్ర వేడుకలకు ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌-సిసి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

Published : 28 Nov 2022 05:32 IST

దిల్లీ: జనవరిలో జరగనున్న భారత గణతంత్ర వేడుకలకు ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతా ఎల్‌-సిసి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు ఈజిప్టు అధ్యక్షుడి పర్యటనపై విదేశీ వ్యవహారాల శాఖ ఆదివారం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. గత నెలలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్‌ కైరోలో పర్యటించిన సందర్భంగా ప్రధాని మోదీ తరఫున అబ్దెల్‌ ఫతాకు ఆహ్వాన పత్రం అందించినట్లు అధికారులు తెలిపారు. గణతంత్ర వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడుముఖ్య అతిథిగా రావడం ఇదే తొలిసారి అవుతుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని