న్యాయపోరాటం చేసి.. ఒక్కటైన యువతుల జంట
కేరళకు చెందిన ఇద్దరు యువతులు అన్ని అడ్డంకులు దాటుకొని ఒక్కటయ్యారు. అదిలా నసరిన్, ఫాతిమా నూర అనే ఇద్దరు యువతులు హైకోర్టులో న్యాయపోరాటం చేసి మరీ ఏకమయ్యారు.
కేరళకు చెందిన ఇద్దరు యువతులు అన్ని అడ్డంకులు దాటుకొని ఒక్కటయ్యారు. అదిలా నసరిన్, ఫాతిమా నూర అనే ఇద్దరు యువతులు హైకోర్టులో న్యాయపోరాటం చేసి మరీ ఏకమయ్యారు. అంగరంగ వైభవంగా వేడుక నిర్వహించుకొని దండలు, ఉంగరాలు మార్చుకున్నారు. అదిలా, ఫాతిమాలకు చిన్నప్పటి నుంచే పరిచయం ఉంది. ఈ క్రమంలోనే జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. వీరి నిర్ణయాన్ని తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో ఈ ఏడాది మే నెలలో కోజికోడ్ నుంచి పారిపోయారు. అదిలా కుటుంబ సభ్యులు వారు షెల్టర్ హోమ్కు వచ్చి యువతులకు నచ్చజెప్పి ఇంటికి తీసుకెళ్లారు. కానీ ఇంటికి వెళ్లాక కుటుంబ సభ్యులు మళ్లీ ఇద్దరినీ విడదీశారు. దీంతో అదిలా కేరళ హైకోర్టును ఆశ్రయించింది. తన భాగస్వామితో కలిసి ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. విచారణ జరిపిన ధర్మాసనం అదిల, ఫాతిమాకు అనుకూలంగా తీర్పు వెలువరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?
-
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు
-
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
-
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
-
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
-
భారత సంతతి డాక్టర్కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్