Tea: బిర్యానీ ఆకులతో చాయ్.. యువత ఫిదా
దిల్లీలో మాస్టర్స్ చదువుతున్న ఓ యువతి వినూత్న టీ స్టాల్ను ప్రారంభించింది.
దిల్లీలో మాస్టర్స్ చదువుతున్న ఓ యువతి వినూత్న టీ స్టాల్ను ప్రారంభించింది. సాధారణ పద్ధతిలో కాకుండా కొత్త విధానంలో చాయ్ తయారు చేస్తోంది. ఆ రుచులకు యువత ఫిదా అవడంతో దుకాణం కళకళలాడుతోంది. ఆమే రాజస్థాన్కు చెందిన జ్యోతి జంగీద్. దిల్లీలో మాస్టర్స్ చదువుతున్న ఆమె ఏదైనా బిజినెస్ చేయాలని అనుకుంది. బాగా ఆలోచించి టీ స్టాల్ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ముఖర్జీనగర్లో ‘జేజే తాడి’ పేరుతో టీ స్టాల్ ప్రారంభించింది. జేజే అంటే జ్యోతి జంగీద్ అని, తాడి అంటే తమ భాషలో కూర్చునే చోటని ఆమె చెబుతోంది.
చాయ్ తయారీలో ఎవరైనా పాలు, నీరు, టీ పొడి, చక్కెర, యాలకులు వినియోగిస్తారు. కానీ ఈ టీ స్టాల్లో మాత్రం గులాబీ రేకులు, బిర్యానీ ఆకులు, తులసి ఆకులను వాడుతున్నారు. వీటితో తయారు చేసిన టీ రుచిగా ఉండటం వల్ల చాయ్ తాగడానికి ప్రజలు తరలివస్తున్నారు. ‘‘నా షాప్లో తయారుచేస్తున్న తేనీరులో సహజసిద్ధ పదార్థాలను ఉపయోగిస్తున్నాను. రోజూ చాలా మంది విద్యార్థులు ఇక్కడికి వచ్చి టీ తాగుతున్నారు. కొందరు రోజుకు 5 సార్లు టీ తాగుతున్నారు. కెమికల్స్ ఉన్న పదార్థాలు టీ తయారీలో వాడట్లేదు కనుక రోజుకు ఎన్నిసార్లు తాగినా ఆరోగ్యానికి హాని కలగదు’’ అని జ్యోతి చెబుతోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Jupiter: గురు గ్రహం చుట్టూ 12 కొత్త ఉపగ్రహాలు
-
Sports News
Deepti Sharma: ముక్కోణపు సిరీస్ అనుభవాలతో ప్రపంచకప్ బరిలోకి దిగుతాం: దీప్తి శర్మ
-
India News
Jammu Kashmir: జోషీమఠ్ తరహాలో.. జమ్మూలోనూ ఇళ్లకు పగుళ్లు..!
-
Latestnews News
MCC: పరిహాసానికి కూడా అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు: ఆండ్రూ స్ట్రాస్
-
India News
Traffic Challan: పరిమిత కాలపు ఆఫర్.. ట్రాఫిక్ చలాన్లపై 50 శాతం డిస్కౌంట్!
-
Sports News
Prithvi Shaw: భారత ఓపెనర్గా పృథ్వీ షాకు అవకాశాలు ఇవ్వాలి: ఇర్ఫాన్ పఠాన్