ముందుగా ఎవరు చనిపోతారని పందెం..
పందెం కోసం స్నేహితుణ్ని చంపిన దారుణ ఘటన హరియాణాలోని సోనిపత్ జిల్లాలో చోటుచేసుకుంది.
స్నేహితుణ్ని రైలు కిందకు తోసి హత్య
పందెం కోసం స్నేహితుణ్ని చంపిన దారుణ ఘటన హరియాణాలోని సోనిపత్ జిల్లాలో చోటుచేసుకుంది. జట్వాడా గ్రామానికి చెందిన మనూ, ముఖేశ్ స్నేహితులు. రాత్రి పీకలదాకా మద్యం తాగిన వారిద్దరూ.. ఆ మత్తులో ఎవరు ముందుగా చనిపోతారని పందెం వేసుకున్నారు. అనంతరం రైల్వే ట్రాక్ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో రైలు రాగా.. దాని ముందుకు మఖేశ్ను తోసేశాడు మనూ. ముఖేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మనూపై కేసు నమోదు చేశామని, విచారణ జరుగుతోందని పోలీసులు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం