ముందుగా ఎవరు చనిపోతారని పందెం..

పందెం కోసం స్నేహితుణ్ని చంపిన దారుణ ఘటన హరియాణాలోని సోనిపత్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

Published : 02 Dec 2022 03:40 IST

స్నేహితుణ్ని రైలు కిందకు తోసి హత్య

పందెం కోసం స్నేహితుణ్ని చంపిన దారుణ ఘటన హరియాణాలోని సోనిపత్‌ జిల్లాలో చోటుచేసుకుంది. జట్వాడా గ్రామానికి చెందిన మనూ, ముఖేశ్‌ స్నేహితులు. రాత్రి పీకలదాకా మద్యం తాగిన వారిద్దరూ.. ఆ మత్తులో ఎవరు ముందుగా చనిపోతారని పందెం వేసుకున్నారు. అనంతరం రైల్వే ట్రాక్‌ వద్దకు చేరుకున్నారు. అదే సమయంలో రైలు రాగా.. దాని ముందుకు మఖేశ్‌ను తోసేశాడు మనూ. ముఖేశ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మనూపై కేసు నమోదు చేశామని, విచారణ జరుగుతోందని పోలీసులు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని