యూపీఎస్సీ ద్వారా ఐఆర్ఎంఎస్ పరీక్ష
ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ (ఐఆర్ఎంఎస్) పరీక్షను 2023 నుంచి యూపీఎస్సీ ద్వారా నిర్వహించనున్నట్లు రైల్వేశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈనాడు - దిల్లీ, హైదరాబాద్: ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ (ఐఆర్ఎంఎస్) పరీక్షను 2023 నుంచి యూపీఎస్సీ ద్వారా నిర్వహించనున్నట్లు రైల్వేశాఖ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. సివిల్ (30), మెకానికల్ (30), ఎలక్ట్రికల్ (60), కామర్స్ అండ్ అకౌంటెన్సీ (30) విభాగాలకు చెందిన మొత్తం 150 పోస్టులకు ఐఆర్ఎంఎస్ పరీక్ష నిర్వహించాలని ఇప్పటికే యూపీఎస్సీని కోరినట్లు పేర్కొంది. ఈ పరీక్ష ప్రిలిమ్స్, మెయిన్స్ పద్ధతిలో రెండంచెల్లో ఉంటుంది. మెయిన్ పరీక్ష 4 పేపర్లుగా (వ్యాస విధానం) రాయాలి. క్వాలిఫైయింగ్ పేపర్స్ కింద పేపర్-ఎ భారతీయ భాషలు, పేపర్-బి ఇంగ్లిష్లో 300 మార్కుల చొప్పున ఉంటాయి. మెరిట్ కోసం పరిగణనలోకి తీసుకొనే అప్షనల్ సబ్జెక్ట్ పేపర్-1, పేపర్-2 ఒక్కోటి 250 మార్కులకు ఉంటాయి. పర్సనాలిటీ టెస్ట్ 100 మార్కులకు ఉంటుంది. సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, కామర్స్ అండ్ అకౌంటెన్సీల్లో ఏదో ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ను అభ్యర్థులు ఎంచుకోవచ్చు. సివిల్ సర్వీసెస్ పరీక్షల తరహాలోనే వీటికి సిలబస్, ఆప్షనల్ సబ్జెక్టులు ఉంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్