తోపుడు బండిపై ఇంటికి మృతదేహం
ఓ గిరిజనుడి మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులు తోపుడు బండిపై ఇంటికి తీసుకు వెళ్లిన దయనీయ ఘటన ఝార్ఖండ్లోని లాతేహార్ జిల్లాలో చోటు చేసుకుంది.
ఓ గిరిజనుడి మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులు తోపుడు బండిపై ఇంటికి తీసుకు వెళ్లిన దయనీయ ఘటన ఝార్ఖండ్లోని లాతేహార్ జిల్లాలో చోటు చేసుకుంది. నది పర్బలుమత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బసియా పంచాయితీకి చెందిన చంద్రు లోహ్రా అనే ఓ వ్యక్తి మద్యానికి బానిసై ఆరోగ్యం పాడుచేసుకున్నాడు. దీంతో అతని కుటుంబ సభ్యులు బాలుమత్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చేర్పించారు. చికిత్స పొందుతూ చంద్రు ఆసుపత్రిలోనే మృతి చెందాడు. మృతదేహన్ని తరలించేందుకు ఆసుపత్రి యాజమాన్యాన్ని అంబులెన్స్ను అడిగారు కుటుంబ సభ్యులు. ఇందుకు యాజమాన్యం నిరాకరించింది. సొంతంగా అంబులెన్స్ను సమకూర్చుకునే స్తోమత లేని ఆ కుటుంబం గురువారం రాత్రి ఓ తోపుడు బండిపై మృతదేహన్ని తీసుకెళ్లింది. ఆసుపత్రి ఆవరణలో అంబులెన్స్ ఉన్నా యాజమాన్యం తమకు ఎలాంటి సాయం అందించలేదని మృతుడి బంధువులు వాపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా