అభిషేక్‌ బెనర్జీ ర్యాలీ వేదిక సమీపంలో పేలుడు

పశ్చిమబెంగాల్‌లోని తూర్పు మేదినీపుర్‌ జిల్లా భూపతినగర్‌ ప్రాంత తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) నేత ఇంట్లో బాంబు పేలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

Published : 04 Dec 2022 05:16 IST

ముగ్గురి మృతి

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లోని తూర్పు మేదినీపుర్‌ జిల్లా భూపతినగర్‌ ప్రాంత తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) నేత ఇంట్లో బాంబు పేలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తెల్లారితే.. టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీ ర్యాలీ జరిగే వేదికకు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. మృతులను రాజ్‌కుమార్‌ మన్నా, దేబ్‌కుమార్‌ మన్నా, బిశ్వజిత్‌ గాయెన్‌గా గుర్తించారు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన పేలుడు తీవ్రతకు ఇంటి పైకప్పు పూర్తిగా కూలిపోయింది. పేలుడుకు దారి తీసిన కారణాలు తెలియరాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు