ఈడబ్ల్యూఎస్ తీర్పులో లోపాలు ఉన్నాయి
ఆర్థికంగా బలహీన వర్గాల (ఈబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైందేనంటూ ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గత నెల 7న ఇచ్చిన మెజారిటీ తీర్పు(3-2)పై సోమవారం సుప్రీంకోర్టులో తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే పిటిషన్ వేసింది.
సమీక్షించండి.. సుప్రీంకోర్టులో డీఎంకే పిటిషన్
దిల్లీ: ఆర్థికంగా బలహీన వర్గాల (ఈబ్ల్యూఎస్)కు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైందేనంటూ ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గత నెల 7న ఇచ్చిన మెజారిటీ తీర్పు(3-2)పై సోమవారం సుప్రీంకోర్టులో తమిళనాడులోని అధికార పార్టీ డీఎంకే పిటిషన్ వేసింది. తీర్పులో లోపాలు ఉన్నాయని, సమీక్షించాలని కోరింది. ఆర్థిక వెనుకబాటు కారణంతో రిజర్వేషన్లు ఇవ్వకూడదని 1992లో ఇందిరా సాహ్ని కేసులో తొమ్మిది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టంగా పేర్కొందని తెలిపింది. ఈడబ్ల్యూఎస్ పరిధి నుంచి ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలను తప్పిస్తూ చేసిన 103వ సవరణ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీయడం లేదని మెజారిటీ ధర్మాసనం పేర్కొనడంపైనా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. సామాజిక వెనుకబాటు, చారిత్రక అణిచివేత ఆధారంగా రాజ్యాంగంలోని అధికరణం 15(4), 16(4) కింద రిజర్వేషన్లు కల్పించారని.. ఆ రకంగా చూసినా తాజా తీర్పులో లోపాలు ఉన్నాయని పేర్కొంది. ఈడబ్ల్యూఎస్ తీర్పుపై కాంగ్రెస్ నేత జయా ఠాకూర్ కూడా గత నెల 23న సమీక్ష పిటిషన్ వేశారు. ఆమె కూడా తీర్పులోని లోపాలనే ప్రస్తావించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో