కేంద్ర మాజీ మంత్రి వై.కె.అలగ్ కన్నుమూత
ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర మాజీ సహాయ మంత్రి యోగీందర్ కె.అలగ్ (83)మంగళవారం తుది శ్వాస విడిశారు.
అహ్మదాబాద్: ప్రముఖ ఆర్థికవేత్త, కేంద్ర మాజీ సహాయ మంత్రి యోగీందర్ కె.అలగ్ (83)మంగళవారం తుది శ్వాస విడిశారు. దీర్ఘకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుత పాకిస్థాన్లోని చక్వాల్లో 1939లో జన్మించిన వై.కె.అలగ్...రాజస్థాన్ విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి ఆర్థిక శాస్త్రంలో పీహెచ్డీ పొందారు. 1996లో గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1996 నుంచి 1998 వరకు కేంద్ర ప్రణాళిక, కార్యక్రమాల అమలు శాఖ, శాస్త్రసాంకేతిక, విద్యుత్తు శాఖల సహాయ మంత్రిగా పనిచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్కు మళ్లీ షాక్.. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!