‘బీబీసీ’ ప్రభావశీల మహిళల్లో నలుగురు భారతీయులు
ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది అత్యధిక ప్రభావం చూపిన 100 మంది ప్రభావశీల మహిళలతో ప్రముఖ వార్తాసంస్థ బీబీసీ రూపొందించిన జాబితాలో నలుగురు భారతీయులు చోటుదక్కించుకున్నారు.
- ప్రియాంకా చోప్రా, శిరీష బండ్ల, గీతాంజలి శ్రీ, స్నేహ జవాలేలకు దక్కిన చోటు
లండన్: ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది అత్యధిక ప్రభావం చూపిన 100 మంది ప్రభావశీల మహిళలతో ప్రముఖ వార్తాసంస్థ బీబీసీ రూపొందించిన జాబితాలో నలుగురు భారతీయులు చోటుదక్కించుకున్నారు. ప్రముఖ నటి-నిర్మాత ప్రియాంకా చోప్రా జోనాస్, ఏరోనాటికల్ ఇంజినీర్ శిరీష బండ్ల, బుకర్ ప్రైజ్ విజేత గీతాంజలి శ్రీ, సామాజిక ఉద్యమకారిణి స్నేహ జవాలేలు ఇందులో స్థానం సంపాదించారు. వీరంతా తమ తమ రంగాల్లో స్ఫూర్తిదాయక విజయాలు సాధించినట్లు బీబీసీ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.