కలుషిత నీరు తాగి ఇద్దరి దుర్మరణం
ప్రభుత్వ పైపులైన్ల ద్వారా సరఫరా అయిన మంచినీరు కలుషితం కావడంతో రాజస్థాన్లోని కరౌలీ జిల్లా హిండైన్ నగరంలో 12 ఏళ్ల బాలుడు, ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయారు.
124 మందికి అస్వస్థత
విచారణకు ఆదేశించిన రాజస్థాన్ ప్రభుత్వం
ప్రభుత్వ పైపులైన్ల ద్వారా సరఫరా అయిన మంచినీరు కలుషితం కావడంతో రాజస్థాన్లోని కరౌలీ జిల్లా హిండైన్ నగరంలో 12 ఏళ్ల బాలుడు, ఓ వృద్ధుడు ప్రాణాలు కోల్పోయారు. 124 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాలుడు మంగళవారం ఉదయం, వృద్ధుడు బుధవారం మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన ప్రజారోగ్య ఇంజినీరింగ్ విభాగం (పీహెచ్ఈడీ) మంత్రి మహేశ్ జోషి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో అధికారులు హిండైన్ నగరంలో ఇంటింటి సర్వే చేపట్టారు. మొత్తం 750కిపైగా ఇళ్లకు ముందుజాగ్రత్తగా అవసరమైన ఔషధాలను పంపిణీ చేశారు. అస్వస్థతకు గురైన 124 మందిని ఆసుపత్రుల్లో చేర్పించగా వారిలో 63 మంది ఇప్పటికే డిశ్ఛార్జి అయ్యారని అధికారులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట