చీకటిగా ఉంది డాడీ.. త్వరగా బయటకు తీయండి
మధ్యప్రదేశ్లో 8 ఏళ్ల తన్మయ్ దియావర్ అనే బాలుడు ఆడుకుంటూ 400 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయాడు.
బోరుబావిలో పడ్డ చిన్నారి అభ్యర్థన
మధ్యప్రదేశ్లో 8 ఏళ్ల తన్మయ్ దియావర్ అనే బాలుడు ఆడుకుంటూ 400 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయాడు. బైతూల్ జిల్లాలోని మండవి గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన సంభవించింది. అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తన్మయ్ 60 అడుగుల వద్ద ఇరుక్కుపోయినట్లు గుర్తించారు. బాలుడికి ఊపిరి ఆడేలా ఆక్సిజన్ పైపు పంపించారు. తాడు సహాయంతో పైకి లాగే ప్రయత్నం చేయగా.. 12 అడుగుల వరకు వచ్చాక తాడు తెగిపోయింది. దీంతో పొక్లెయిన్లతో బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వుతున్నారు. మరోవైపు, అధికారులు ఏర్పాటుచేసిన సాధనం ద్వారా తండ్రితో మాట్లాడిన బాలుడు ‘‘నాన్నా.. ఇక్కడ చీకటిగా ఉంది. భయం వేస్తోంది. నన్ను త్వరగా బయటకు తీయండి’’ అని వేడుకోవడం అక్కడివారిని కదిలించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!