‘పెద్దనోట్ల రద్దు’ దస్త్రాలన్నింటినీ సమర్పించండి
పెద్దనోట్ల రద్దుపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు బుధవారం ప్రకటించింది.
కేంద్రం, ఆర్బీఐలకు సుప్రీం ఆదేశం
దిల్లీ: పెద్దనోట్ల రద్దుపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తన తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు బుధవారం ప్రకటించింది. అయితే.. ఈ నిర్ణయానికి సంబంధించిన మొత్తం రికార్డులన్నింటినీ తమకు పదో తేదీలోపు సమర్పించాలని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ), కేంద్రాలను ఆదేశించింది. మిగిలిన పక్షాలూ తమ తుది నివేదనలను రాతపూర్వకంగా సమర్పించాలని పేర్కొంది. ‘‘వాదనలు విన్నాం, తీర్పును రిజర్వులో ఉంచుతున్నాం. రద్దుకు సంబంధించిన రికార్డులన్నింటిని సమర్పించాలని కేంద్రం, ఆర్బీఐలను ఆదేశిస్తున్నాం’’ అని జస్టిస్ ఎస్.ఎ.నజీర్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ఈ రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ బి.ఆర్.గవాయ్, జస్టిస్ ఎ.ఎస్.బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ బి.వి.నాగరత్నలు ఇతర సభ్యులు. కోర్టు మార్గదర్శకాల ప్రకారం సంబంధిత రికార్డులను సమర్పిస్తామని కేంద్రం తరఫున హాజరైన అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణి తెలిపారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు నిర్ణయాన్ని కేంద్రం.. 2016 నవంబరు 8న తీసుకుంది. దీన్ని సవాలు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానంలో 58 పిటిషన్లు దాఖలయ్యాయి. గత కొన్ని రోజులుగా వీటిపై రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఈ సందర్భంగా.. కేంద్రం, ఆర్బీఐ, పిటిషనర్ల వాదనలను వింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండను పార్టీ అడిగిన రష్మిక.. ఎందుకంటే..?
-
ప్రధాని మోదీ, బిల్గేట్స్.. ‘చాయ్ పే చర్చ’
-
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
-
నిన్న అమెరికా, నేడు ఐరాస.. భారత అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు!
-
మేనల్లుడికి అత్యున్నతాధికారి నజరానా!
-
ముఖ్యమంత్రితో ముఖాముఖిలో వాలంటీరు