చోరీ అనుమానంతో చిన్నారికి చెప్పులదండ
సహ విద్యార్థినికి చెందిన రూ.400 డబ్బు అపహరించిందన్న అనుమానంతో అయిదో తరగతి చదువుతున్న ఓ బాలికకు చెప్పులదండ వేసి, దెయ్యంలా అలంకరణ చేసి ఆవరణలో తిప్పిన అమానుష ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్ర హాస్టలులో వెలుగుచూసింది.
బైతూల్: సహ విద్యార్థినికి చెందిన రూ.400 డబ్బు అపహరించిందన్న అనుమానంతో అయిదో తరగతి చదువుతున్న ఓ బాలికకు చెప్పులదండ వేసి, దెయ్యంలా అలంకరణ చేసి ఆవరణలో తిప్పిన అమానుష ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్ర హాస్టలులో వెలుగుచూసింది. హాస్టలు పర్యవేక్షకురాలి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఘటనపై బైతూల్ జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. దమిజిపుర గ్రామంలోని గిరిజన బాలికల ప్రభుత్వ వసతిగృహం వారం రోజుల కిందట ఈ దుశ్చర్యకు వేదికగా మారింది. బాలిక కుటుంబసభ్యులు మంగళవారం జిల్లా కలెక్టర్ అమన్వీర్ సింగ్ను కలిసి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బాహ్య ప్రపంచానికి తెలిసింది. హాస్టలు పర్యవేక్షకురాలిని ఆ విధుల నుంచి తప్పించినట్లు గిరిజన వ్యవహారాల శాఖ అసిస్టెంట్ కమిషనర్ శిల్పా జైన్ తెలిపారు. ఈ ఘటన జరిగిన తర్వాత బాధిత బాలిక హాస్టలులో ఉండేందుకు ససేమిరా అంటున్నట్లు ఆమె తండ్రి తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
RRR: ఆస్కార్ బరిలో నిలిచిన చిత్రాలను వెనక్కి నెట్టి.. నంబరు 1గా ‘ఆర్ఆర్ఆర్’
-
Sports News
Ajinkya Rahane: ఐపీఎల్-15 సీజన్ తర్వాత లీసెస్టర్షైర్కు ఆడనున్న అజింక్య రహానె
-
Crime News
Crime News: అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం.. 13 మంది సజీవ దహనం
-
Movies News
Social Look: పూజాహెగ్డే ‘వెడ్డింగ్ ఫీవర్’.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అట్లీ దంపతులు
-
Politics News
YSRCP: ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు నిరూపిస్తా: వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి
-
Sports News
IND vs AUS: ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండానే టెస్టు సిరీస్ ఆడటమా..?: ఆసీస్ క్రికెట్ దిగ్గజం