ఏడాదిలో భారతీయ భాషల్లోకి పాఠ్య పుస్తకాల అనువాదం
రానున్న ఆరు నెలల నుంచి ఏడాదిలో ఆంగ్ల భాషల్లో ఉన్న పాఠ్య పుస్తకాలను భారతీయ భాషల్లోకి అనువదింపజేయాలని విశ్వ విద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) నిర్ణయించింది.
అంతర్జాతీయ ప్రచురణకర్తలతో యూజీసీ ఛైర్మన్ భేటీ
ఈనాడు, దిల్లీ: రానున్న ఆరు నెలల నుంచి ఏడాదిలో ఆంగ్ల భాషల్లో ఉన్న పాఠ్య పుస్తకాలను భారతీయ భాషల్లోకి అనువదింపజేయాలని విశ్వ విద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) నిర్ణయించింది. అనువాదంతో పాటు భారతీయ భాషల్లో పాఠ్యాంశాలు రచించే రచయితలు/విద్యావేత్తలను, భారతీయ ప్రచురణ సంస్థలను ప్రోత్సహించాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా పాఠ్య పుస్తకాల అనువాదంపై ప్రముఖ అంతర్జాతీయ పుస్తక ప్రచురణ సంస్థల ప్రతినిధులతో యూజీసీ ఛైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్ సమావేశమయ్యారు. దేశవ్యాప్తంగా అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సులకు సంబంధించి ఇంగ్లిషులో ఉన్న పాఠ్య పుస్తకాలను తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ, ఒడియా, బెంగాలీ, అస్సామీ, పంజాబీ, గుజరాతీ, హిందీ, ఉర్దూ భాషల్లోకి అనువదించాల్సిన అవసరాన్ని ఆయన ప్రతినిధులకు వివరించారు. మార్గదర్శకాల రూపకల్పనకు ఓ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తొలుత బీఏ, బీకాం, బీఎస్సీ పాఠ్యపుస్తకాలను అనువదించి ఆ తర్వాత పీజీ కోర్సుల పుస్తకాలపై దృష్టిసారించనున్నట్లు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్