మాస్కు మర్చిపోయిన జర్మనీ ఛాన్సిలర్‌.. ఏం చేశారంటే..!

జర్మనీ చాన్సిలర్‌ ఏంజెలా మెర్కెల్‌ ఇవీవల జరిగిన ఆ దేశ పార్లమెంట్‌ సమావేశంలో పొరపాటున మాస్కు పెట్టుకోవడం మర్చిపోయారు. చట్టసభ్యులను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం ఆమె పెట్టుకున్న మాస్కును టేబుల్‌పై మర్చిపోయి వెళ్లి తన స్థానంలో కూర్చున్నారు....

Published : 21 Feb 2021 12:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని పలువురు దేశాధినేతలు ప్రజలను హెచ్చరిస్తుంటారు. అంతేకాదు.. తాము చెప్పిన విషయాలను విధిగా పాటిస్తుంటారు. అయితే జర్మనీ చాన్స్‌లర్‌‌ ఏంజెలా మెర్కెల్‌ ఇటీవల జరిగిన ఆ దేశ పార్లమెంట్‌ సమావేశంలో పొరపాటున మాస్కు పెట్టుకోవడం మర్చిపోయారు. తోటిసభ్యులను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం ఆమె పెట్టుకున్న మాస్కును టేబుల్‌పై మర్చిపోయి వెళ్లి తన స్థానంలో కూర్చున్నారు. వెంటనే పొరపాటును గుర్తించిన మెర్కెల్‌ మాస్కు తెచ్చుకొని ధరించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని