ఈ దేశాల్లో సెప్టెంబరు నుంచి బూస్టర్ డోస్
కొవిడ్ కట్టడి క్రమంలో తమ పౌరులకు సెప్టెంబరు నుంచి బూస్టర్ డోస్(మూడో విడత టీకా) ఇచ్చేందుకు ఫ్రాన్, జర్మనీ సిద్ధమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా మరింతమందికి వ్యాక్సిన్ దక్కేవరకు ఈ ప్రక్రియ వాయిదా వేయాలన్న
డబ్ల్యూహెచ్వో ఆదేశాలు బేఖాతరు!
ఇంటర్నెట్ డెస్క్: తమ పౌరులకు సెప్టెంబరు నుంచి కొవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోస్(మూడో విడత టీకా) ఇచ్చేందుకు ఫ్రాన్, జర్మనీ సిద్ధమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా మరింతమందికి వ్యాక్సిన్ దక్కేవరకు ఈ ప్రక్రియ వాయిదా వేయాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్వో) సూచనలను బేఖాతరు చేస్తూ.. ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ‘మూడో విడత టీకా అవసరం కావచ్చు. వృద్ధృలకు, వైరస్ సోకే అవకాశం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తామ’ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ ఇన్స్టాగ్రాం వేదికన తెలిపారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి, వయోవృద్ధులకు, ఆసుపత్రుల్లో ఉండేవారికి టీకా అందించాలని భావిస్తున్నట్లు జర్మనీ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
అర్థం చేసుకున్నా.. కానీ, ఇది ఆమోదయోగ్యం కాదు
బూస్టర్ డోస్ విషయమై డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ టెడ్రోస్ అధనోమ్ బుధవారం కీలక ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. ‘సెప్టెంబరు చివరి వరకు ఈ ప్రక్రియ నిలపాలి. డెల్టా వేరియంట్ బారినుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వాలు పడుతున్న ఆందోళనను నేను అర్థం చేసుకున్నా. కానీ.. కొన్ని దేశాలు ఇప్పటికే పెద్దఎత్తున వ్యాక్సిన్లు వినియోగించాయి. ఇప్పుడు మరిన్ని వినియోగించడం ఆమోదయోగ్యం కాద’ని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు జర్మనీ ఈ వ్యాఖ్యలను ఖండించింది. తామూ పేద దేశాలకు 30 మిలియన్ల టీకాలను విరాళంగా సరఫరా చేస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు ఫ్రాన్స్.. నాలుగో వేవ్ను ఎదుర్కొనేందుకు, కొవిడ్ కట్టడి విషయంలో ప్రభుత్వ నిర్ణయాలపై ప్రజలనుంచి వస్తున్న వ్యతిరేకతను తగ్గించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు