FabiSpray: కొవిడ్ చికిత్స.. అందుబాటులోకి తొలి నాజల్ స్ప్రే..!
కొవిడ్-19 బాధితులకు చికిత్సలో భాగంగా భారత్లో తొలి నాజల్ స్ప్రే అందుబాటులోకి వచ్చింది. ముంబయి కేంద్రంగా ఉన్న ప్రముఖ ఫార్మా కంపెనీ గ్లెన్మార్క్ ‘ఫాబిస్ప్రే’ (FabiSpray) పేరుతో దీనిని విడుదల చేసింది.
విడుదల చేసిన గ్లెన్మార్క్ ఫార్మా
ముంబయి: కొవిడ్-19 బాధితులకు చికిత్సలో భాగంగా భారత్లో తొలి నాజల్ స్ప్రే అందుబాటులోకి వచ్చింది. ముంబయి కేంద్రంగా ఉన్న ప్రముఖ ఫార్మా కంపెనీ గ్లెన్మార్క్ ‘ఫాబిస్ప్రే’ (FabiSpray) పేరుతో దీనిని విడుదల చేసింది. కొవిడ్-19తో బాధపడుతున్న వయోజనులకు ఈ స్ప్రేను అందించవచ్చని తెలిపింది. కెనడాకు చెందిన సనోటైజ్ ఫార్మా సంస్థ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఈ నైట్రిక్ ఆక్సైడ్ నాజల్ స్ప్రేను భారత్లో తయారీ, మార్కెట్ చేసుకునేందుకు గ్లెన్మార్క్ ఫార్మాకు భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI) అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
‘ఈ నాజల్ స్ప్రే తీసుకున్న 24గంటల్లో 94శాతం వైరల్ లోడ్ తగ్గుతుండగా, 48 గంటల్లో 99శాతం తగ్గుతున్నట్లు భారత్లో జరిపిన మూడోదశ ప్రయోగాల్లో వెల్లడైంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ నాజల్ స్ప్రే సురక్షితమే కాకుండా కొవిడ్ బాధితులకు ఎటువంటి దుష్ప్రభావాలు తలెత్తడం లేదు. ఫాబిస్ప్రే పేరుతో దీన్ని మార్కెట్లోకి అందుబాటులోకి తెస్తున్నాం’ అని గ్లెన్మార్క్ ఫార్మా సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా ముక్కుద్వారా తీసుకున్నప్పుడు వైరస్ను అడ్డుకోవడంలో భౌతికంగా, రసాయనంగా ఇది దోహదం చేస్తుందని తెలిపింది. కొవిడ్-19కు కారణమైన వైరస్ ఊపిరితిత్తుల్లోకి చేరకముందే శ్వాసకోస మార్గం ప్రవేశంలోనే నిర్మూలించే లక్ష్యంతోనే ఫాబిస్ప్రేను అభివృద్ధి చేశామని గ్లెన్మార్క్ వెల్లడించింది.
‘తుదిదశ ప్రయోగ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. వైరల్ లోడ్ తగ్గించడంతోపాటు కొవిడ్ బాధితులు త్వరగా కోలుకోవడంలో మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నాజల్ స్ప్రే ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది’ అని గ్లెన్మార్క్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ మోనికా టాండన్ పేర్కొన్నారు. ఆల్ఫా, బీటా, గామా, డెల్టాతో ఎప్సిలాన్ వంటి వేరియంట్లను ఈ నాజల్ స్ప్రే కొన్ని నిమిషాల్లోనే నాశనం చేస్తున్నట్లు అమెరికాలోని యూటా స్టేట్ యూనివర్సిటీలో జరిపిన ప్రయోగాల్లో తేలిందని గుర్తుచేశారు.
మరోవైపు ఔషధ నియంత్రణ సంస్థల నిబంధనల ప్రకారం ఈ నాజల్ స్ప్రే తుది దశ ప్రయోగాలను భారత్లోనూ చేపట్టారు. దేశవ్యాప్తంగా 20చోట్ల 306 మంది కొవిడ్ బాధితులపై నిర్వహించి ఫలితాలను విశ్లేషించారు. వీటిలోనూ నైట్రిక్ ఆక్సైడ్ నాజల్ స్ప్రే సురక్షితమని తేలడంతో కొవిడ్ చికిత్సలో వినియోగించేందుకు డీసీజీఐ అనుమతులు మంజూరు చేసింది. దీంతో తాజాగా ఈ ఔషధాన్ని గ్లెన్మార్క్ సంస్థ మార్కెట్లోకి విడుదల చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.