cybercrime: దిల్లీలో ఇంటర్పోల్ వార్షిక సమావేశాలు ప్రారంభం
ఇంటర్పోల్ వార్షిక సమావేశాల్లో 195 దేశాల నుంచి ఇంటర్పోల్ సభ్యలు పాల్గొన్నారు. వీరిలో మంత్రులు, పోలీస్ చీఫ్లు, ఆయా దేశాల సెంట్రల్ బ్యూరో సభ్యులు, సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
ఇంటర్నెట్డెస్క్: ఇంటర్పోల్ 90వ వార్షిక సమావేశాలు న్యూదిల్లీలో మంగళవారం ప్రారంభమయ్యాయి. ప్రగతి మైదాన్లో జరుగుతున్న ఈ సమావేశాలను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఆయనతోపాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా కూడా ఉన్నారు. ఈ వార్షిక సమావేశాల్లో 195 దేశాల నుంచి ఇంటర్పోల్ సభ్యులు పాల్గొన్నారు. వీరిలో మంత్రులు, పోలీస్ చీఫ్లు, ఆయా దేశాల సెంట్రల్ బ్యూరో సభ్యులు, సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. పాకిస్థాన్ కూడా ఇద్దరు సభ్యులను ఈ సమావేశాలకు పంపింది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నా ఈ సమావేశానికి పాక్ ప్రతినిధులు హాజరుకావడం గమనార్హం. 1997లో కూడా ఒకసారి భారత్లో ఇంటర్పోల్ సమావేశం జరిగింది.
2025 నాటికి భారీ పెరగనున్న సైబర్ నేరాలు: ఇంటర్పోల్ చీఫ్
సైబర్ నేరాలు, ఆన్లైన్లో పిల్లలపై అఘాయిత్యాల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఇంటర్పోల్ చీఫ్ జుర్గెన్ స్టాక్ పేర్కొన్నారు. ఇటువంటి నేరాలు చాలా వరకు ఫిర్యాదుల వరకు వెళ్లడంలేదన్నారు. ప్రపంచ వ్యాప్తంగా 2025 నాటికి సైబర్ నేరాల విలువ 10.5 ట్రిలియన్ డాలర్లకు చేరుకొంటుందని చెప్పారు. న్యూదిల్లీలో ఇంటర్పోల్ 90వ వార్షిక సమావేశానికి ముందు జురెన్ స్టాక్ విలేకర్లతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యవస్థీకృత నేరగాళ్ల ముఠాలు వేల కోట్లు సంపాదిస్తున్నాయని స్టాక్ వెల్లడించారు. వీటిల్లో కేవలం 1శాతం మాత్రమే పట్టుకోవడంగానీ, స్వాధీనం చేసుకోవడంగానీ జరుగుతోందని చెప్పారు. ఇంటర్పోల్ గ్లోబల్ స్టాప్ పేమెంట్ వ్యస్థను, యాంటీ మనీ లాండరింగ్ ర్యాపిడ్ రెస్పాన్స్ ప్రొటోకాల్ అభివృద్ధి చేసిందన్నారు. గత 10 నెలల్లోనే నేరగాళ్ల నుంచి 60 మిలియన్ డాలర్లు రికవరీ చేసినట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
నేటి నుంచి ‘వీఐటీఈఈఈ’ ప్రవేశ పరీక్షలు
వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ కోర్సులో చేరేందుకు వీఐటీ.. ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలను (వీఐటీఈఈఈ) నిర్వహిస్తోంది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్