Corona: అధికారిక లెక్కల కంటే వాస్తవంగా మూడు రెట్లు అధిక మరణాలు..!
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ భయానక వాతావరణాన్ని సృష్టించింది. దయనీయ పరిస్థితుల్ని కల్పించింది.
ఈ అంతరం భారత్లోనే ఎక్కువ
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ భయానక వాతావరణాన్ని సృష్టించింది. దయనీయ పరిస్థితుల్ని కల్పించింది. ఇప్పటికీ ఆ ప్రభావం నుంచి మనం బయటపడలేదు. ఈ క్రమంలో లక్షల్లో మరణాలు సంభవించాయి. అయితే అధికారిక లెక్కల కంటే వాస్తవంలో మూడు రెట్లు అధికంగా మృతి చెంది ఉండొచ్చని తాజాగా లాన్సెట్ నివేదిక వెల్లడించింది. 2020, జనవరి 1 నుంచి 2021, డిసెంబర్ 31 వరకు సంభవించిన మరణాలు గురించి ఈ నివేదిక పేర్కొంది.
ఆ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 60 లక్షల మంది కరోనా కారణంగా మృత్యుఒడికి చేరుకున్నారు. కానీ, మన ప్రభుత్వాలు లెక్కించిన దాని కంటే మహమ్మారి తీవ్ర ప్రభావం చూపిందని లాన్సెట్ తెలిపింది. వాస్తవంలో మృతుల సంఖ్య దాదాపు 1.82 కోట్లుగా ఉండొచ్చని వెల్లడించింది. ఈ అంతరం దక్షిణాసియా, సబ్ సహారన్ ఆఫ్రికాలో ఎక్కువగా ఉందని తెలిపింది. అదే సమయంలో భారత్లో దాదాపు 4,89,000 మరణాలు నమోదయ్యాయి. లెక్క ప్రకారం చూసుకుంటే ప్రతి లక్షమందికి 18.3 మంది మరణించారని, వాస్తవంలో మాత్రం లక్షకు 152.5గా ఉండొచ్చని వెల్లడించింది. అదే ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే.. లక్షకు 39.2 మరణాలు అని లెక్కించినన్పటికీ, వాస్తవ అంచనా మాత్రం 120.3 అని పేర్కొంది. ఈ అంతరం భారత్లోనే ఎక్కువగా ఉందని తెలిపింది.
కాగా, నివేదించిన వాటి కంటే వాస్తవంలో ఎక్కువగా మరణాలు ఉండటానికి గల కారణాలను లాన్సెట్ విశ్లేషించింది. తగిన స్థాయిలో నిర్ధారణ పరీక్షలు అందుబాటులో లేకపోవడం, మరణాలను లెక్కించే విషయంలో సవాళ్లు ఈ పరిస్థితి కారణం కావొచ్చని తెలిపింది. అలాగే తగిన స్థాయిలో వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడంతో ఎక్కువమంది ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని చెప్పింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!