భారత్‌లో టీకా..అంతర్జాతీయంగా ప్రశంసలు

భారతదేశం కరోనా వైరస్ టీకాలకు ఆమోదం తెలపడంపై అంతర్జాతీయ సంస్థలు, ప్రముఖుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.

Updated : 05 Jan 2021 14:26 IST

దిల్లీ: కరోనా వైరస్ టీకాలకు భారత్‌ ఆమోదం తెలపడంపై అంతర్జాతీయ సంస్థలు, ప్రముఖుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ క్రమంలో మహమ్మారిని అంతం చేయాలనే భారత్ సంకల్పాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ కొనియాడింది. అలాగే దేశ నాయకత్వం నిర్ణయాత్మక చర్యలు తీసుకుందని పేర్కొంది.

WHO డైరెక్టర్‌ జనరల్ టెడ్రోస్ అధనామ్: భారత్ నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటూ, కొవిడ్‌-19 మహ్మమారిని అంతం చేయాలనే సంకల్పాన్ని ప్రదర్శిస్తోంది. అతిపెద్ద టీకా ఉత్పత్తిదారుగా అలా చేయడం మంచిదే. మనం కలిసి పనిచేస్తే, అత్యంత ప్రమాదం పొంచి ఉన్న వర్గాలను రక్షించగలం. సమర్థవంతమైన, సురక్షితమైన టీకాలు ఉపయోగిస్తున్నామని నిర్ధారించగలం.

బిల్‌గేట్స్: ప్రపంచమంతా కొవిడ్‌-19కు ముగింపు పలకాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో శాస్త్రీయ ఆవిష్కరణ, టీకా తయారీ సామర్థ్యంలో భారత‌ నాయకత్వం గొప్పగా ఉంది.

అలాగే వీరిద్దరు ట్విటర్ వేదికగా భారత్ ప్రయత్నాలను ప్రశంసించడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీని ట్యాగ్ చేశారు. 

కాగా, అత్యవసర వినియోగం కింద కొవిగ్జాన్, కొవిషీల్డ్ టీకాలకు భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ ఆదివారం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే ఆ నిర్ణయాన్ని ఆరోగ్య సంస్థ స్వాగతించింది. కరోనాపై చేస్తున్న పోరాటాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు కట్టడిని ఉద్ధృతం చేయడంలో భారత్ నిర్ణయం దోహదపడుతుందని అభిప్రాయపడింది. 

ఇవీ చదవండి:

మోదీ నాయకత్వం వల్లే టీకా సాకారం: షా

58కి చేరిన యూకే కరోనా కేసులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని