Assembly polls: గోవాలో ‘ఓటెత్తారు’.. ఉత్తరాఖండ్, యూపీల్లో భారీగానే పోలింగ్!
ఉత్తరాఖండ్, గోవా అసెంబ్లీ ఎన్నికలతో పాటు యూపీలోని రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు.....
దిల్లీ: ఉత్తరాఖండ్, గోవా అసెంబ్లీ ఎన్నికలతో పాటు యూపీలోని రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ అధికారులు ఎన్నికలు నిర్వహించారు. సాయంత్రం 5గంటల వరకు యూపీలోని 55 నియోజకవర్గాల్లో 61.43తం పోలింగ్ నమోదు కాగా.. గోవాలో రికార్డు స్థాయిలో 79.94శాతం; ఉత్తరాఖండ్లో 59.51శాతం చొప్పున పోలింగ్ నమోదైంది. యువ ఓటర్లు ఎంతో ఆనందంగా వచ్చి తొలిసారి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే, వృద్ధులు, వికలాంగులు సైతం పోలింగ్ కేంద్రాలకు ఉత్సాహంగా తరలివచ్చి ఓటేసి తమ చైతన్యాన్ని చాటారు.
నేటి ఎన్నికల పోలింగ్లో ముఖ్యాంశాలు..
- ఉత్తరాఖండ్లో 70స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 632మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 63మంది మహిళలే. ఇక్కడ మొ త్తం 82.67లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అయితే, సాయంత్రం 5గంటల వరకు 59.94శాతం పోలింగ్ నమోదైంది. క్యూలైన్లలో వేచి ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు.
- గోవాలో మొత్తం 40 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ పూర్తయింది. 301 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో 26మంది మహిళలే. గోవాలో మొత్తంగా 11.57లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఉదయం నుంచే ఓటర్లు భారీ సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలిరావడంతో రికార్డుస్థాయిలో పోలింగ్ శాతం నమోదైంది. సాయంత్రం 5గంటల వరకు 79.94 శాతం పోలింగ్ నమోదైంది.
- ఇకపోతే, మొత్తం 403 స్థానాలు కలిగిన ఉత్తర్ప్రదేశ్లో ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు రెండో విడతలో 55 స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ ఎన్నికల్లో 586 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. వీరిలో 69మంది మహిళలే. ఈ నియోజకవర్గాల పరిధిలో 2.02కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అయితే, సాయంత్రం 5గంటల వరకు యూపీలో 61.43శాతం పోలింగ్ నమోదైంది.
- ఎన్నికల బహిష్కరణ: యూపీలో బదౌన్ జిల్లాలోని షేక్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రెండు గ్రామాల ప్రజలు ఎన్నికల్ని బహిష్కరించారు. తమ గ్రామంలో కలుషిత నీటి సమస్యను పరిష్కరించాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నా పట్టించుకోకపోవడంతో వారు పోలింగ్కు దూరంగా ఉన్నారు.ఈ అంశంపై బదౌన్ సబ్ డివిజినల్ మెజిస్ట్రేట్ బీపీ శర్మ మాట్లాడుతూ.. ఈ అంశంపై తాము ప్రజలతో చర్చించామనీ.. సమస్య పరిష్కారానికి కృషిచేస్తున్నామన్నారు. అయితే, తమ సమస్యను పరిష్కరించే వరకు ఓటు వేయబోమని ప్రజలు తేల్చి చెప్పారు. ఈ నీటిని తాగిన వారిలో తీవ్రమైన వ్యాధులకు గురై కొందరు ప్రాణాలు కోల్పోయారంటూ ఆవేదన వ్యక్తంచేశారు.
- గుండెపోటుతో అధికారి మృతి: యూపీలో సహ్రాన్పూర్లో ఎన్నికల విధుల్లో ఉన్న రిటర్నింగ్ అధికారి (55) గుండెపోటుతో మృతిచెందడం విషాదం రేపింది. రషీద్ అలీ రిటర్నింగ్ అధికారి ధిక్కా తాప్రి అనే గ్రామంలో ఎన్నికల విధులకు ఆదివారం చేరుకున్నారు. అయితే, ఆయనకు ఆదివారం రాత్రి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆరోగ్యం విషమించింది. దీంతో ఆయన్ను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా అర్ధరాత్రి 1.30గంటలకు మృతిచెందినట్టు జిల్లా ఎన్నికల అధికారి వెల్లడించారు.
- మాకు రోడ్లు వేయలేదు. ఓటెందుకు వెయ్యాలి?: ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ నియోజకవర్గంలోని రెండు గ్రామాల ప్రజలు ఎన్నికల్ని బహిష్కరించారు. తమ గ్రామాల్లో రోడ్లు నిర్మించకపోవడంపై అసంతృప్తి వ్యక్తంచేసిన జగ్గీభగవాన్, చిలౌండ్ గ్రామాల ప్రజలు.. వారు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు అధికారులు ఎంతగా ప్రయత్నించినా లొంగలేదు. చిలౌంద్లో 225 మంది ఓటర్లు ఉండగా.. జగ్గీభగవాన్లో 376 ఓటర్లు ఉన్నారు. ఎప్పట్నుంచో తమ సమస్యల్ని పరిష్కరించాలని చెప్పినా అధికారులు పట్టించుకోలేదని గ్రామస్థులు వాపోతున్నారు.
- అంబులెన్స్లో వచ్చి ఓటేశారు: 70 ఏళ్ల వృద్ధురాలు ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నప్పటికీ అంబులెన్స్లోనే పోలింగ్ కేంద్రానికి వచ్చి తన ఓటు హక్కు వినియోగించుకొని స్ఫూర్తిని చాటారు. తన తల్లి తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్నారనీ.. అయితే, ఎలాగైనా ఓటు వేయాలన్న ఆమె కోరికను నెరవేర్చాలనే ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు భాజపా కార్పొరేటర్ పునీత్ చౌహాన్ తెలిపారు. ఓటు వేసిన అనంతరం తిరిగి ఆస్పత్రికి వెళ్లిపోయారు.
- నాకు 100 ఏళ్లు.. అన్ని ఎన్నికల్లోనూ ఓటేశా: ఉత్తరాఖండ్లో వందేళ్ల వయసు కలిగిన వృద్ధులు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకొని స్ఫూర్తిని చాటారు. ఉత్తరాఖండ్లోని కాప్కోట్ అసెంబ్లీ నియోజకవర్గంలో వందేళ్ల వృద్ధుడు ఓటు హక్కువినియోగించుకున్నారు. వాలంటీర్లు ఆయన్ను పోలింగ్ బూత్ వద్దకు తీసుకొచ్చారు. అనంతరం ఆయన్ను అధికారులు శాలువాతో సత్కరించారు. అలాగే, దేహ్రాదూన్లోని కోట్ద్వార్లో 100 ఏళ్ల వృద్ధురాలు విశ్వేశ్వరిదేవి నౌడియాల్ పోలింగ్ కేంద్రానికి తరలివచ్చి ఓటు వేశారు. తనకు వందేళ్లనీ.. ఇప్పటివరకు ప్రతి ఎన్నికల్లోనూ ఓటు వేసినట్టు ఆమె తెలిపారు. తన ఇంటి నుంచి 200 మీటర్లు నడుచుకొని వచ్చి తన మనవళ్లతో కలిసి ఓటు హక్కువినియోగించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
4 వాంగ్మూలాలతో సీఎం అరెస్టా?
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని అణచివేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రయత్నిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. -
నిరంతర ప్రేరణ శక్తి.. స్వామి స్మరణానంద
రామకృష్ణమఠం, రామకృష్ణ మిషన్లకు 16వ అధిపతిగా ఉన్న స్వామి స్మరణానంద కన్నుమూత తనను నిర్ఘాంతపరిచిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. -
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లకు కుతంత్రాలు
న్యాయవ్యవస్థపై ఒత్తిళ్లు తీసుకువచ్చి, న్యాయస్థానాల ప్రతిష్ఠను మసకబార్చేందుకు ‘స్వార్థ ప్రయోజనాలతో కూడిన ఒక బృందం’ ప్రయత్నాలు చేస్తోందని 600 మందికిపైగా న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్కు ఉమ్మడిగా లేఖ రాశారు. -
దిల్లీ హైకోర్టులోనూ కాంగ్రెస్కు ఎదురుదెబ్బ
ఆదాయపు పన్ను అంశంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. 2017 నుంచి 2021 మధ్య కాలానికి ఆదాయపు పన్ను(ఐటీ) విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను నిలిపివేయాలంటూ ఆ పార్టీ దాఖలు చేసిన పిటిషన్లను గురువారం దిల్లీ హైకోర్టు కొట్టివేసింది. -
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
దేశం అప్పు రూ.160 లక్షల కోట్లు
కేంద్ర ప్రభుత్వ అప్పులు గత డిసెంబరు నాటికి రూ.160.69 లక్షల కోట్లకు చేరాయి. గత సెప్టెంబరు నాటికి రూ.157.84 లక్షల కోట్లు ఉన్న అప్పులు డిసెంబరు నాటికి మరింత పెరిగాయి. -
ఉపాధిహామీ వేతనాల సవరణ
ఉపాధిహామీ పథకం కింద చెల్లించే వేతనాలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. రాష్ట్రాలవారీగా 4 నుంచి 10 శాతం మేర ఇవి పెరిగాయి. -
ఈడీ విచారణకు మహువా గైర్హాజరు
విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో దిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కార్యాలయంలో గురువారం నాటి విచారణకు తృణమూల్ కాంగ్రెస్ నాయకురాలు మహువా మొయిత్రా గైర్హాజరయ్యారు. -
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్