ఇకపై హైదరాబాద్‌ నుంచి మాల్దీవులకు నేరుగా

హైదరాబాద్‌ నుంచి మాల్దీవులకు మొదటి డైరక్ట్‌ విమానాన్ని ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభించనున్నట్లు గో ఎయిర్‌ విమానయాన సంస్థ ప్రకటించింది.

Published : 04 Feb 2021 20:42 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నుంచి మాల్దీవులకు మొదటి డైరెక్ట్‌ విమానాన్ని ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభించనున్నట్లు గో ఎయిర్‌ విమానయాన సంస్థ ప్రకటించింది. ఈ మేరకు వారు తమ ట్విటర్‌లో ప్రకటించారు. వారానికి నాలుగురోజులు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని వారు తెలిపారు. సోమ, మంగళ, గురు, ఆది వారాల్లో ఈ సర్వీసులు ఉంటాయని పేర్కొన్నారు. పర్యాటకులు హైదరాబాద్‌ నుంచి మాల్దీవుల్లోని మాలెకు నేరుగా చేరుకొనే అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఎయిర్‌ బస్‌ ఏ320ని ఈ సర్వీసులకు వినియోగించనున్నట్లు వారు తెలిపారు. ‘‘హైదరాబాద్‌ నుంచి మాలెకు వెళ్లే ప్రయాణికులు తమ ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా మార్చుకొనేందుకు అదనపు అవకాశాలు అందిస్తున్నాం.’’ అని గోఎయిర్‌ సీఈవో కౌశిక్‌ తెలిపారు.

ఇవీ చదవండి..

296 యాప్స్‌ నిషేధం

ఆ ట్వీట్ల వెనక కుట్ర ఉంది


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని