డీఏపీపై సబ్సిడీ పెంపు.. కేబినెట్‌ పచ్చజెండా

కరోనాతో నెలకొన్న సంక్షోభ సమయంలో రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. వ్యవసాయ పొలాల్లో పంటల సాగులో విరివిగా వాడే డై అమ్మోనియా ఫాస్పేట్‌ (డీఏపీ) ఎరువుల బస్తాపై ఇస్తున్న .....

Published : 16 Jun 2021 22:33 IST

దిల్లీ: కరోనాతో నెలకొన్న సంక్షోభ సమయంలో రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. వ్యవసాయ పొలాల్లో పంటల సాగులో విరివిగా వాడే డై అమ్మోనియా ఫాస్పేట్‌ (డీఏపీ) ఎరువుల బస్తాపై ఇస్తున్న సబ్సిడీని భారీగా కేంద్రం పెంచింది. ఈ మేరకు బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్రవేసింది. ఒక్కో బస్తాపై అదనంగా రూ.700 చొప్పున సబ్సిడీ ఇచ్చేందుకు మంత్రివర్గం అంగీకరించింది. ఈ నిర్ణయంతో కేంద్రంపై రూ.14,775 కోట్ల అదనపు భారం పడనున్నట్టు కేంద్రమంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ తెలిపారు. గతేడాది రూ.1700గా ఉన్న డీఏపీ 50కిలోల బస్తా ధర ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో రూ.2400కు చేరింది. ఈ నేపథ్యంలో గత నెలలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో డీఏపీపై ఇస్తున్న రాయితీని 140 శాతం పెంచాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జరిగిన తాజాగా జరిగిన కేబినెట్‌ సమావేశంలో డీఏపీపై ఇస్తున్న రాయితీని రూ.500 నుంచి రూ.1200కు పెంచేందుకు అంగీకరించింది. దీంతో మార్కెట్లో రూ.2400 ఉన్న డీఏపీ బస్తా రైతులకు రూ.1200కే రానుంది. మరోవైపు, ఎరువుల సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో దాదాపు రూ.79,600 కోట్లు కేటాయింపులు జరిపిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని