Consumer Affairs: ప్రచారం ఎందుకో వినియోగదారుడికి చెప్పాల్సిందే..!
భౌతికంగా కానీ, అవతార్ లేదా గ్రాఫిక్స్ ద్వారా సెలబ్రిటీలు లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు తాము బ్రాండింగ్ చేసే ఉత్పత్తులకు, తమకు ఎలాంటి సంబంధనం ఉందనేది బహిర్గతం చేయాలి.
దిల్లీ: ఏదైనా కంపెనీ ఉత్పత్తులు లేదా సేవలకు ప్రచారకర్తలుగా (Brand Ambassdors) వ్యవహరించే సెలబ్రిటీలు (Celebrities) లేదా సామాజిక మాధ్యమాల్లో లక్ష కంటే ఎక్కువ మంది అనుసరిస్తున్న వ్యక్తులు (Social Media Influencers) ఇకపై ఆయా ఉత్పత్తులకు ఎందుకు ప్రచారం చేస్తున్నామనేది బహిర్గతం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు వినియోగదారుల వ్యవహారాల శాఖ ఎండార్స్మెంట్ నో హౌస్ (Endorsement Know Hows) పేరుతో శుక్రవారం కొత్తగా మార్గదర్శకాలను జారీ చేసింది.
ఆడియో/వీడియో ప్రకటనలతోపాటు సామాజిక మాధ్యమాల్లో నిర్వహించే ప్రచారానికి సైతం ఈ నిబంధనలు వర్తిస్తాయని వినియోగదారుల వ్యవహారాలశాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. ఒకవేళ ఏదైనా సంస్థ లేదా సెలబ్రిటీ నిబంధనలను పాటించకున్నా, విరుద్ధంగా వ్యవహరించినా వారిపై వినియోగదారుల పరిరక్షణ చట్టం 2019 ప్రకారం ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటారు.
2022 గణాంకాల ప్రకారం సామాజిక మాధ్యమాల్లో గతేడాది ₹ 1,275 కోట్ల విలువైన ప్రచారాలు జరిగాయి. 2025 నాటికి ఈ విలువ ₹ 2,800 కోట్లకు పెరుగుతుందని అంచనా. ఈ నేపథ్యంలో వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడం కోసం ఈ నిబంధననను తప్పనిసరి చేశారు. భౌతికంగా కానీ, అవతార్ లేదా గ్రాఫిక్స్ ద్వారా సెలబ్రిటీలు లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు ప్రచారం చేసినా ఈ నిబంధనను పాటించాలని సూచించింది.
అతిక్రమిస్తే చర్యలేంటి?
ఒకవేళ ఎవరైనా సెలబ్రిటీ లేదా సంస్థ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) సదరు కంపెనీ ఉత్పత్తులపై నిషేధం విధించడంతోపాటు, సెలబ్రిటీపై ఏడాడి నుంచి మూడు ఏళ్లకు ఇతర ఉత్పత్తులకు ప్రచారం చేయకుండా నిషేధం విధిస్తారు. దాంతోపాటు కంపెనీకి, ప్రచారకర్తకు ₹ 10 లక్షల నుంచి ₹ 50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉందని తెలిపారు.
నిబంధన ఎందుకు?
‘‘ఇటీవలి కాలంలో సెలబ్రిటీలు లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు సామాజిక మాధ్యమాల ద్వారా పలు కంపెనీల ఉత్పత్తులు లేదా సేవలకు ప్రచారం చేస్తున్నారు. వాటిలో చాలా వరకు వినియోగదారుల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటున్నాయి. ప్రకటనలో చూపించినట్లు ఆయా ఉత్పత్తులు లేదా సేవలు వినియోగదారులకు ఫలితాలను ఇవ్వటంలేదని గుర్తించాం. దీనివల్ల వినియోగదారులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఇకపై సెలబ్రిటీలు తాము సదరు ఉత్పత్తికి ఎందుకు ప్రచారం చేస్తున్నారు? ఆయా కంపెనీల నుంచి నగదు తీసుకున్నారా? లేదా ఆ కంపెనీలతో తమకు ఎలాంటి సంబంధం ఉందనేది యూజర్లకు తెలియజేయాలి. అందులో భాగంగానే కొత్త మార్గదర్శకాలను తీసుకొస్తున్నాం’’ అని రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు.
ఎవరు? ఎప్పుడు? ఎలా?
కొత్త మార్గదర్శకాల ప్రకారం సెలబ్రిటీలు లేదా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లలో ఎవరు? ఎప్పుడు? ఎలా? ప్రచారానికి సంబంధించిన వివరాలను చెప్పాలనేది కూడా వెల్లడించారు. వీక్షకులు లేదా ఫాలోవర్స్ను ప్రభావితం చేయగలిగిన వారు, వినియోగదారులను కొనుగోలు చేసేలా ప్రేరేపించగలిగే వ్యక్తులు లేదా సంస్థలు, సమాజంలో ఉన్నతస్థాయిలో ఉండి ప్రచారకర్తలుగా వ్యవహరించేవారు.. తాము ఆయా ఉత్పత్తులకు ఎందుకు ప్రచారం చేస్తున్నామనేది వినియోగదారులకు అర్థమయ్యేలా సులభతరమైన పద్ధతిలో బహిర్గతం చేయాలి. అది టెక్ట్స్/ఆడియో/వీడియో రూపంలోనైనా ఉండొచ్చు. ఒకవేళ లైవ్లో ప్రచారం చేస్తున్నట్లయితే.. ప్రసారం అవుతున్నంతసేపు ఎందుకు ప్రచారం చేస్తున్నామనేది వినియోగదారులకు తెలిసేలా స్క్రీన్పై డిస్ప్లే చేయాలి.
ప్రస్తుత సమాజంలో టీవీ, వార్తా పత్రికలు, రేడియోల కంటే సామాజిక మాధ్యమాలు వినియోగదారులపై ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వినియోగదారుల పరిరక్షణ చట్టానికి మరింత బలం చేకూర్చి, చట్ట విరుద్ధంగా జరిగే ఉత్పత్తుల ప్రచారాలను కట్టడి చేసేందుకు ఈ కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొస్తున్నట్లు రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
ఈడీ విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధమేనని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కోర్టులో గురువారం ఆయన తన వాదనలు స్వయంగా వినిపించారు. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
డ్రగ్స్ జప్తు కేసులో మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను దోషిగా తేల్చిన కోర్టు
కస్టడీ మరణం కేసులో ఇప్పటికే జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్ను న్యాయస్థానం మరో నేరంలో దోషిగా నిర్ధారించింది. -
నేపాల్ మేయర్ కుమార్తె ఆచూకీ లభ్యం
గోవాలో రెండ్రోజుల క్రితం అదృశ్యమైన నేపాల్లోని ధన్గఢీ నగర మేయర్ కుమార్తె ఆర్తీ హమాల్(36) ఆచూకీ బుధవారం లభ్యమైంది.
తాజా వార్తలు (Latest News)
-
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
-
ఈడీ విచారణను ఎదుర్కొంటా.. కోర్టులో కేజ్రీవాల్ స్వీయ వాదనలు
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి