సైరస్ మిస్త్రీ ప్రమాద ఘటన.. ఇక వంతెనలకు క్రాష్ బారియర్లు..!
వంతెనలపై వాహనాలకు భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఉన్న బ్రిడ్జీలపై రెయిలింగ్ల స్థానంలో క్రాష్ బారియర్లు ఏర్పాటు చేయాలని రాష్ట్రాలను సూచించినట్లు తెలుస్తోంది.
(ప్రతీకాత్మక చిత్రం)
ఇంటర్నెట్ డెస్క్: మూడు నెలల క్రితం ప్రముఖ పారిశ్రామికవేత్త సైరస్ మిస్త్రీ (Cyrus Mistry) కారు ప్రమాదంలో అకాల మరణం చెందడం అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. కారు అతివేగం, సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో పాటు ప్రమాదం జరిగిన వంతెన (Bridges) వద్ద క్రాష్ బారియర్లు (Crash Barriers) లేకపోవడం కూడా ఈ దుర్ఘటనకు ఓ కారణమని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే వంతెనల వద్ద వాహనాల భద్రతా ప్రమాణాలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్రిడ్జీలపై రెయిలింగ్స్ (Railing) తొలగించి వాటి స్థానంలో క్రాష్ బారియర్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.
వంతనలపై రెయిలింగ్స్ను తొలగించి క్రాష్ బారియర్లను ఏర్పాటు చేసే అవసరంపై కేంద్ర రోడ్లు, రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవల.. అన్ని రాష్ట్రాలు, జాతీయ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) అధికారులకు ఓ సర్క్యులర్ జారీ చేసినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ‘‘వంతెనలపై రాకపోకలు సాగించే వాహనాలకు భద్రత కల్పించేందుకు క్రాష్ బారియర్లను ఏర్పాటు చేయడం అత్యవసరం. అయితే, ప్రస్తుతం ఉన్న వంతెనలను వెడల్పు చేయకుండా వాటి రెయిలింగ్స్ను మార్చడం నిర్మాణపరంగా సమర్థంగా ఉంటుందా? లేదా? అన్నదే సమస్య. ఈ విషయాన్ని మంత్రిత్వశాఖ పరిశీలిస్తోంది. అయితే, రెయిలింగ్స్ స్థానంలో క్రాష్ బారియర్లను ఏర్పాటు చేసేముందు కొన్ని కీలక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. క్రాష్ బారియర్ల నిలువు పటిష్టత, డిజైన్ లోడ్, కాంక్రీట్ నాణ్యతను తనిఖీ చేయాలి’’ అని ఆ సర్క్యులర్లో పేర్కొన్నారు.
ఇక ఫుట్పాత్ ఉన్నా లేకపోయినా కొత్తగా నిర్మించే వంతెలకు క్రాష్ బారియర్లను ఏర్పాటు చేయాలని ఆ సర్క్యులర్లో సూచించారు. ‘రెండు లేన్లతో ఉన్న వంతెనలన్నీ వెడల్పు చేసినా చేయకపోయినా లోపలి వైపు క్రాష్ బారియర్లు.. బయటివైపు పాదచారుల రెయిలింగ్స్ను తప్పనిసరిగా ఏర్పాటుచేయాలి. ఇక నాలుగు లేన్లతో ఉన్న వంతెనలకైతే.. రెయిలింగ్స్ను తొలగించి వాటి స్థానంలో క్రాష్ బారియర్లను అమర్చాలి’’ అని కేంద్ర మంత్రిత్వశాఖ స్పష్టం చేసినట్లు ఆ సర్క్యులర్లో ఉంది.
ఈ ఏడాది సెప్టెంబరులో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ కన్నుమూసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం పాలయ్యారు. అహ్మదాబాద్ నుంచి ముంబయి వెళ్తుండగా.. మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లాలో సూర్యనది వంతెనపై ఆయన ప్రయాణిస్తున్న కారు రెయిలింగ్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో మిస్త్రీతో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కారులో మిస్త్రీ వెనుకవైపు కూర్చున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణంగా తెలిసింది. ప్రమాద సమయంలో మిస్త్రీ సీటు బెల్టు కూడా పెట్టుకోలేదట. ఇక, ఆ వంతెన గోడ వద్ద క్రాష్ బారియర్లు ఉంటే.. ప్రమాద తీవ్రత తగ్గేదేమో అనే అభిప్రాయాలూ వినిపించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.