ట్రంప్ వీడ్కోలు: చాలా అందంగా ఉంది
మొదటి నుంచి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిని విమర్శిస్తుంటారు పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రేటా థన్బర్గ్.
మాజీ అధ్యక్షుడికి కౌంటర్ ఇచ్చిన టీనేజర్
వాషింగ్టన్: మొదటి నుంచి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిని విమర్శిస్తుంటారు పర్యావరణ పరిరక్షణ కార్యకర్త గ్రేటా థన్బర్గ్. కొత్త అధ్యక్షుడిగా బైడెన్ రాకతో..ట్రంప్ అధ్యక్ష భవనాన్ని వీడుతున్నప్పటి ఫొటోను ఆమె షేర్ చేశారు. ‘ఆ దృశ్యం చూడటానికి బాగుంది’అనే క్యాప్షన్ ఇచ్చారు.
శ్వేతసౌధాన్ని వీడుతూ, చివరిసారిగా కమాండర్ ఇన్ చీఫ్ హోదాలో తన అనుచరులు, అభిమానులను ఉద్దేశించి డొనాల్డ్ ట్రంప్ చేతితో సంజ్ఞ చేశారు. ఆ దృశ్యం థన్బర్గ్ కంట పడింది. వెంటనే దాన్ని ట్విటర్లో షేర్ చేసి.. తనదైన శైలిలో స్పందించారు. ‘ఈ దృశ్యం చూడటానికి చాలా బాగుంది. సంతోషంగా ఉన్న ఓ వృద్ధుడు అందమైన భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నట్లుంది’ అని వ్యంగ్యంగా ఓ వ్యాఖ్యను జోడించారు.
పర్యావరణ మార్పులపై గత కొన్నేళ్లుగా గ్రేటా థన్బర్గ్ పోరాటం చేస్తున్నారు. పలు అంతర్జాతీయ వేదికలపై దేశాధినేతలను ఆమె ప్రశ్నించారు. ఓసారి ఐరాసలో ప్రసంగిస్తూ..పర్యావరణానికి ముప్పు కలిగించే నిర్ణయాలతో పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడానికి ఎంత ధైర్యం అంటూ ప్రపంచ నాయకులను ప్రశ్నించారు. ఆమె తీరును విమర్శిస్తూ.. కోపాన్ని నియంత్రించుకోవాలంటూ ట్రంప్ ఆమెకు సూచించారు కూడా. అలాగే ఐరాసలో ఆమె చేసిన ప్రసంగంపై స్పందిస్తూ.. ఉజ్వలమైన భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్న, సంతోషంగా ఉన్న బాలికలా ఆమె కనిపిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు అవే మాటలతో థన్బర్గ్ ట్రంప్కు కౌంటర్ ఇచ్చారు. ఈ మాజీ అధ్యక్షుడిని ఆయన వాడిన పదాలతోనే తిప్పికొట్టడం థన్బర్గ్కు కొత్తేమీ కాదు. కాగా, ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికలల్లో ఆమె మొదటి నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్కే మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇవీ చదవండి:
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా