తెల్లారితే పెళ్లి..పెళ్లికుమారుడు మాయం

తెల్లారితే పెళ్లి.. అప్పటి వరకు విందులో కలియతిరిగాడు పెళ్లికుమారుడు. ఆ తర్వాత అదృశ్యమయ్యాడు.

Published : 05 Jan 2021 09:08 IST

చిక్కమగళూరు‌: తెల్లారితే పెళ్లి.. అప్పటి వరకు విందులో కలియతిరిగాడు పెళ్లికుమారుడు. ఆ తర్వాత అదృశ్యమయ్యాడు. పొద్దునే వివాహం కోసం ఎదురు చూస్తున్న పెళ్లి కూతురుని మనువాడేందుకు మరో నవవరుడు ముందు కొచ్చాడు.

ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం చిక్కమగళూరులోని తారికారే తాలుకాలో జరిగింది. సింధు, నవీన్‌ అనే యువతీయువకులకు పెద్దలు వివాహం నిశ్చయించి ఏర్పాట్లు చేశారు. అయితే నవీన్‌ వేరే యువతితో ప్రేమలో ఉన్నాడు. పెళ్లి ఆపేస్తానని ఆ యువతి హెచ్చరించడం వల్లే నవీన్‌ పారిపోయాడని సమాచారం. ఇక.. తెల్లవారితే పెళ్లి అని ఎన్నో ఆశలతో ఉన్న సింధు జీవితం ఏమవుతుందో అని అంతా ఆవేదన వ్యక్తం చేశారు. అయితే వారి బాధను అర్థం చేసుకున్న చంద్రు అనే వ్యక్తి ఆమెను వివాహం చేసుకోవడానికి ముందుకొచ్చాడు. చంద్రు కండక్టర్‌గా పనిచేస్తున్నాడు.

ఇవీ చదవండి...
4 రాష్ట్రాల్లో బర్డ్‌ ఫ్లూ కలకలం
కార్డుల డేటా కొల్లగొట్టారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని