Modi: వరుణ్ లేఖ నన్ను కలచివేసింది: మోదీ
తమిళనాడులో ఇటీవల వాయుసేన హెలికాప్టర్ కూలి గాయాలై.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన గ్రూప్ కెప్టెన్ వరుణ్సింగ్ను ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో గుర్తుచేసుకొని ఆవేదన వ్యక్తం చేశారు....
మన్ కీ బాత్లో ప్రధాని ఆవేదన
దిల్లీ: తమిళనాడులో ఇటీవల వాయుసేన హెలికాప్టర్ కూలి గాయాలై.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన గ్రూప్ కెప్టెన్ వరుణ్సింగ్ను ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో గుర్తుచేసుకొని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఆగస్టులో శౌర్యచక్ర పురస్కారం అందుకున్న వరుణ్.. చిన్ననాటి స్కూల్ ప్రిన్సిపల్కు రాసిన లేఖ చదివిన తర్వాత తన హృదయం బరువెక్కిందని అన్నారు. ఆ స్థాయికి చేరుకున్న తర్వాత కూడా ఆయన మూలాల్ని మరిచిపోలేదని కొనియాడారు. పైగా ఉత్సాహంగా వేడుక చేసుకోవాల్సిన సమయంలో ముందు తరాల గురించి చింతించారని తెలిపారు.
డిసెంబరు 8న త్రిదళపతి జనరల్ బిపిన్రావత్ సహా 14 మంది సైనిక బృందం ప్రయాణిస్తున్న హెలికాప్టర్ తమిళనాడులోని కున్నూర్లో కుప్పకూలింది. ఘటనాస్థలిలోనే 13 మంది మృతి చెందగా.. తీవ్రగాయాలైన గ్రూప్ కెప్టెన్ వరుణ్సింగ్ను తమిళనాడులోని వెల్లింగ్టన్ ఆసుపత్రిలో చేర్చారు. మెరుగైన చికిత్స కోసం ఆ తర్వాత బెంగళూరులోని ఐఏఎఫ్ కమాండో ఆసుపత్రికి తరలించారు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించినా ఫలితం లేకపోయింది.
వరుణ్ లేఖలో రాసింది ఇదే..
‘సగటు విద్యార్థిగా ఉన్నా పర్వాలేదు. పాఠశాలలో బాగా చదవడం, ప్రతి పరీక్షలో 90కి పైగా మార్కులు సాధించడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. ఒకవేళ అలా చేస్తే అద్భుత ఘనత కిందే లెక్క. వారిని అభినందించాల్సిందే. అయితే- మార్కులు బాగా రానంతమాత్రాన మీరు ఎప్పుడూ సగటు మనిషిలా ఉండిపోతారేమోనని నిరుత్సాహపడకండి. పాఠశాలలో మీరు సగటు విద్యార్థి కావొచ్చు. భవిష్యత్తులో జరగబోయేదానికి మాత్రం అది కొలమానం కాదు. మీకు ఏది ఇష్టమో గుర్తించండి. ఏ రంగంలోకి దిగినా అంకితభావంతో పనిచేయండి. నేను సగటు విద్యార్థిని. 12వ తరగతిలో అతికష్టం మీద ఫస్ట్ డివిజన్ సాధించాను. క్రీడల్లోనూ అంతంతమాత్రమే. కానీ నాకు విమానాలన్నా.. విమానయాన రంగమన్నా అమితాసక్తి. అందులో చూపిన తెగువ కారణంగా రాష్ట్రపతి చేతుల మీదుగా శౌర్యచక్ర అవార్డు దక్కింది’ అని ఈ ఏడాది సెప్టెంబరు 18న రాసిన లేఖలో వరుణ్ పేర్కొన్నారు.
మన్ కీ బాత్ ప్రసంగంలోని ఇతర కీలకాంశాలు..
* ప్రపంచదేశాలతో పోలిస్తే కరోనా వ్యాక్సినేషన్ విషయంలో భారత్ అద్భుతమైన పురోగతి సాధించిందని ప్రధాని అన్నారు. 140 కోట్ల డోసుల మైలురాయిని దాటడం ప్రతి భారతీయుడి విజయంగా ఆయన అభివర్ణించారు.
* కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గుట్టు విప్పేందుకు శాస్త్రవేత్తలు నిరంతం కృషి చేస్తున్నారని మోదీ అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ స్వీయ అవగాహనతో క్రమశిక్షణగా ఉండాలని సూచించారు.
* వచ్చే ఏడాది విద్యార్థుల కోసం ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని కొనసాగిస్తానని తెలిపారు. పరీక్షల సందర్భంగా జరిగే ఈ కార్యక్రమంలో 9-12 తరగతి విద్యార్థులకు ఈసారి ఆన్లైన్లో కొన్ని పోటీలు కూడా ఉండనున్నాయని తెలిపారు. దీనికోసం త్వరలో రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానుందన్నారు.
* కొత్త సంవత్సరంలో పుస్తక పఠనాన్ని మరింత ఆసక్తిగా మారుద్దామని ప్రజలకు ప్రధాని పిలుపునిచ్చారు. ఈ ఏడాది చదవాలనుకుంటున్న పుస్తకాలను ఇతరులతో పంచుకోవాలని సూచించారు. తద్వారా ప్రతిఒక్కరికీ కొత్త సంవత్సరంలో చదవాల్సిన పుస్తకాల జాబితా సిద్ధమవుతుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
బెంగళూరులోని బ్రూక్ఫీల్డ్లో ‘రామేశ్వరం కేఫ్’ బాంబు పేలుడు ఘటనలో కీలక కుట్రదారుని అరెస్టు చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. -
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
ఎయిరిండియాకు విమానాలను లీజుకు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయంటూ నమోదైన కేసును కొట్టివేస్తూ.. నిందితుడిగా ఉన్న అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్కు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. -
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
ఇతరులను వేధించడం, వారిపై కన్నెర్ర చేయడం కాంగ్రెస్ సంస్కృతి అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. -
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు వేధిస్తున్నారని ఆయన సతీమణి సునీత ఆరోపించారు. -
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
సాయుధ బలగాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, దేశ సరిహద్దులు పూర్తి సురక్షితమని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. -
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ న్యాయస్థానం నిర్ణయించింది. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం