వ్యవసాయ చట్టాలకు మద్దతుగా తోమర్‌కు లేఖ

కేంద్ర వ్యవసాయ చట్టాలకు మద్దతు పలుకుతూ పలు రాష్ట్రాల రైతు సంఘాల సభ్యులు సోమవారం కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ను కలిశారు. చట్టాల్లో కేంద్రం ప్రతిపాదించిన సవరణలకు తాము మద్దతు ఇస్తున్నట్లు పేర్కొంటూ వారు తోమర్‌కు మెమోరాండం అందజేశారు.

Published : 15 Dec 2020 00:02 IST

దిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలకు మద్దతు పలుకుతూ పలు రాష్ట్రాల రైతు సంఘాల సభ్యులు సోమవారం కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ను కలిశారు. వ్యవసాయ చట్టాల్లో కేంద్రం ప్రతిపాదించిన సవరణలకు తాము మద్దతు ఇస్తున్నట్లు పేర్కొంటూ వారు తోమర్‌కు మెమోరాండం సమర్పించారు. ఓ వైపు దిల్లీ సరిహద్దుల్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసనలు కొనసాగుతున్న తరుణంలో పలు రాష్ట్రాల రైతు సంఘాలు వాటికి మద్దతు పలుకుతూ తోమర్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. తోమర్‌ను కలిసిన వారిలో ఉత్తర్‌ప్రదేశ్‌, కేరళ, తమిళనాడు, తెలంగాణ, బిహార్‌, హరియాణా రాష్ట్రాల ‘ఆల్‌ ఇండియా కిసాన్‌ సమన్వయ సమితి’ సభ్యులు ఉన్నారు. 

‘మేం ఆలిండియా కిసాన్‌ సమన్వయ సమితి తరఫున తోమర్‌ను కలిసేందుకు వచ్చాం. మేం వ్యవసాయ చట్టాలపై కేంద్రం ప్రతిపాదించిన సవరణలకు మద్దతు తెలియజేస్తున్నాం. ఎప్పటిలాగే ఎంఎస్‌పీ, మండి వ్యవస్థను కొనసాగించాలి. నూతన వ్యవసాయ చట్టాలతో మేం సంతృప్తిగా ఉన్నాం. ఈ నూతన చట్టాలను వెనక్కి తీసుకోకండి ’ అని వారు లేఖలో పేర్కొన్నారు. అనంతరం తోమర్‌ మాట్లాడుతూ.. ‘కేంద్ర వ్యవసాయ చట్టాలు రైతులకు చేసే మేలు గురించి వారు తమ అనుభవాల్ని నాతో పంచుకున్నారు. మోదీ ప్రభుత్వం రైతుల మేలు కోసమే ఈ చట్టాలు తెచ్చిందన్నారు. వాటికి తాము మద్దతు తెలుపుతున్నామని చెప్పారు’ అని తోమర్‌ తెలిపారు. ఇప్పటికే ఆదివారం హరియాణా, ఉత్తరాఖండ్‌ నుంచి పలువురు రైతుల బృందాలు తోమర్‌ కలిసి చట్టాలకు మద్దతు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని