Moonlighting: పేదపిల్లల చదువు కోసం కూలీగా మూన్లైటింగ్
ఒడిశాకు చెందిన నగేశు పాత్రో ఓ అతిధి అద్యాపకుడు. కానీ, పేద పిల్లల కోసం నిర్వహిస్తున్న ఉచిత కోచింగ్ సెంటర్ కోసం ఆయన కూలీగా కూడా పనిచేస్తున్నారు. వచ్చిన సొమ్మును టీచర్లకు జీతాలుగా చెల్లిస్తున్నారు.
బరంపూర్: ఈ మధ్య చాలా మంది అదనపు ఆదాయం కోసం మూన్లైటింగ్ చేస్తున్నారు. అంటే ఒక ప్రధాన ఉద్యోగంతో పాటు ఖాళీ సమయాల్లో మరో పనిచేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా.. వీరంతా డిమాండ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకుందామని ఇలా చేస్తున్నారు. ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన సిహెచ్ నగేశు పాత్రో (Nageshu Patro) కూడా మూన్లైటింగ్ చేస్తున్నారు. కానీ, ఆయన కథ మాత్రం చాలా భిన్నమైంది. పాత్రో చేస్తున్న రెండో ఉద్యోగం రైల్వే స్టేషన్లో కూలీ పని. పైగా ఆయన చేస్తున్నది తన జేబు నింపుకోవడానికి మాత్రం కాదు. మరి ఆయన ఎవరి కోసం కూలీగా మారారు? ప్రధాన ఉద్యోగం ఏంటి? వంటి ఆసక్తికర అంశాలు చూద్దాం..
నగేశు పాత్రో (Nageshu Patro)ది ఒడిశాలోని గంజాం జిల్లా. ఆయన ప్రైవేటు కాలేజీలో అతిథి అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. పేద పిల్లల కోసం ఓ ఉచిత కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. దాంట్లో బోధించేవారికి జీతాలిచ్చేందుకు తన ఆదాయం సరిపోవడం లేదు. దీంతో రాత్రివేళల్లో బరంపూర్ రైల్వే స్టేషన్లో కూలీ పనికి వెళ్తున్నారు. కొవిడ్ మహమ్మారి సమయంలో ఖాళీగా ఉండే బదులు పేద పిల్లలకు ఉచితంగా బోధించడం ప్రారంభించానని పాత్రో తెలిపారు. క్రమంగా పిల్లల సంఖ్య పెరగడంతో ఎనిమిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ కేంద్రాన్ని తెరిచారు. స్వయంగా హిందీ, ఒడియా బోధిస్తున్నారు. మిగిలిన సబ్జెక్టుల కోసం ఇతరులను నియమించుకున్నారు.
ప్రస్తుతం ఆయన దగ్గర నలుగురు టీచర్లు పనిచేస్తున్నారు. వారికి నెలకు రూ.10,000 నుంచి రూ.12,000 వరకు చెల్లిస్తున్నారు. ఈ మొత్తాన్నే ఆయన కూలీగా పనిచేస్తూ సంపాదిస్తున్నారు. అతిథి అధ్యాపకుడిగా ఆయన రూ.8,000 ఆర్జిస్తున్నారు. ఆ మొత్తంతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. పాత్రోకు తల్లి, తండ్రి ఉన్నారు. వారు గంజాం జిల్లా మనోహర్ గ్రామంలో నివసిస్తున్నారు. కూలీగా పనిచేయడానికి తనకు ఏమాత్రం బిడియంగా లేదని పాత్రో అంటున్నారు. తనకు బోధన అంటే ఇష్టమని.. ఎవరు ఏమనుకున్నా పేదపిల్లల కోసం కూలీ పని చేస్తూనే ఉంటానన్నారు.
తాను చేస్తున్న ఈ పనికి ప్రేరణ ఏంటని పాత్రోను ప్రశ్నించగా.. చదువుకోవడానికి తాను పడ్డ కష్టాలేనని చెబుతున్నారు. తన తండ్రి గతంలో గొర్రెలకాపరిగా ఉండేవారని.. దీంతో కుటుంబం గడవడం కూడా కష్టంగా ఉండేదన్నారు. దీంతో 2006లో తాను హెచ్ఎస్సీ పరీక్షకు హాజరుకాలేకపోయానని తెలిపారు. కానీ, చదువుపై ఉన్న మక్కువతో దూరవిద్య ద్వారా 2012లో 12వ తరగతి పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యారు. తర్వాత డిగ్రీ పూర్తిచేశారు. అనంతరం బరంపూర్ విశ్వవిద్యాలయం నుంచి పీజీ పట్టా అందుకున్నారు. చదువుకు అయ్యే ఖర్చును రాత్రివేళ కూలీగా చేస్తూనే సమకూర్చుకున్నారు. పేద పిల్లలెవరూ చదువుకోవడానికి తనలా కష్టపడొద్దనే కోచింగ్ సెంటర్ను ప్రారంభించానని పాత్రో తెలిపారు.
ఈ మధ్య రైల్వే స్టేషన్లలో ట్రాలీ బ్యాగ్లు, ఎస్కలేటర్లు విరివిగా వినియోగిస్తున్నారని పాత్రో తెలిపారు. దీంతో కూలీల ఆదాయం పడిపోయిందన్నారు. ఈ నేపథ్యంలో కష్టపడి పనిచేస్తున్న రైల్వే కూలీల కోసం ఏదైనా చేయాలని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
అమేఠీ నుంచి రాహుల్ గాంధీ పోటీపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు. -
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియ శ్రీనేత్
కాంగ్రెస్ (Congress) నేత సుప్రియా శ్రీనేత్ వరుసగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలపై భాజపా (BJP) మండిపడింది. -
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
Supreme Court: ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలని, దీనిలో ఎలాంటి అనుమానాలకు తావివ్వొద్దని సుప్రీంకోర్టు తెలిపింది. -
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులకు చెందిన రూ.98కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. -
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్.. రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాగే ఆయన భాజపాపై పోరాడే తీరును ఎద్దేవా చేశారు. -
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
Encounter Specialist: బస్తర్లో మంగళవారం చోటుచేసుకున్న భారీ యాంటీ నక్సల్స్ ఆపరేషన్కు ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించారు. ఆయన ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్..! మావోయిస్టులకు సింగంగా ఆయనకు పేరుంది. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
-
ఇన్నేళ్లుగా ‘రాహుల్’యాన్ను లాంచ్ చేయలేకపోయింది: రాజ్నాథ్ సింగ్
-
లింక్ క్లిక్ చేస్తున్నారా? ఆగండి..! మెసేజ్ మూలాలు చెక్ చేయండి..
-
మొన్న కంగనపై.. నేడు ఎన్కౌంటర్పై.. వరుస వివాదాల్లో సుప్రియ శ్రీనేత్
-
తేజ సజ్జా కొత్త చిత్రం.. టైటిల్ ఏమిటంటే..?