Moonlighting: పేదపిల్లల చదువు కోసం కూలీగా మూన్లైటింగ్
ఒడిశాకు చెందిన నగేశు పాత్రో ఓ అతిధి అద్యాపకుడు. కానీ, పేద పిల్లల కోసం నిర్వహిస్తున్న ఉచిత కోచింగ్ సెంటర్ కోసం ఆయన కూలీగా కూడా పనిచేస్తున్నారు. వచ్చిన సొమ్మును టీచర్లకు జీతాలుగా చెల్లిస్తున్నారు.
బరంపూర్: ఈ మధ్య చాలా మంది అదనపు ఆదాయం కోసం మూన్లైటింగ్ చేస్తున్నారు. అంటే ఒక ప్రధాన ఉద్యోగంతో పాటు ఖాళీ సమయాల్లో మరో పనిచేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లుగా.. వీరంతా డిమాండ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకుందామని ఇలా చేస్తున్నారు. ఒడిశాలోని గంజాం జిల్లాకు చెందిన సిహెచ్ నగేశు పాత్రో (Nageshu Patro) కూడా మూన్లైటింగ్ చేస్తున్నారు. కానీ, ఆయన కథ మాత్రం చాలా భిన్నమైంది. పాత్రో చేస్తున్న రెండో ఉద్యోగం రైల్వే స్టేషన్లో కూలీ పని. పైగా ఆయన చేస్తున్నది తన జేబు నింపుకోవడానికి మాత్రం కాదు. మరి ఆయన ఎవరి కోసం కూలీగా మారారు? ప్రధాన ఉద్యోగం ఏంటి? వంటి ఆసక్తికర అంశాలు చూద్దాం..
నగేశు పాత్రో (Nageshu Patro)ది ఒడిశాలోని గంజాం జిల్లా. ఆయన ప్రైవేటు కాలేజీలో అతిథి అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. పేద పిల్లల కోసం ఓ ఉచిత కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేశారు. దాంట్లో బోధించేవారికి జీతాలిచ్చేందుకు తన ఆదాయం సరిపోవడం లేదు. దీంతో రాత్రివేళల్లో బరంపూర్ రైల్వే స్టేషన్లో కూలీ పనికి వెళ్తున్నారు. కొవిడ్ మహమ్మారి సమయంలో ఖాళీగా ఉండే బదులు పేద పిల్లలకు ఉచితంగా బోధించడం ప్రారంభించానని పాత్రో తెలిపారు. క్రమంగా పిల్లల సంఖ్య పెరగడంతో ఎనిమిదో తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు ప్రత్యేక కోచింగ్ కేంద్రాన్ని తెరిచారు. స్వయంగా హిందీ, ఒడియా బోధిస్తున్నారు. మిగిలిన సబ్జెక్టుల కోసం ఇతరులను నియమించుకున్నారు.
ప్రస్తుతం ఆయన దగ్గర నలుగురు టీచర్లు పనిచేస్తున్నారు. వారికి నెలకు రూ.10,000 నుంచి రూ.12,000 వరకు చెల్లిస్తున్నారు. ఈ మొత్తాన్నే ఆయన కూలీగా పనిచేస్తూ సంపాదిస్తున్నారు. అతిథి అధ్యాపకుడిగా ఆయన రూ.8,000 ఆర్జిస్తున్నారు. ఆ మొత్తంతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. పాత్రోకు తల్లి, తండ్రి ఉన్నారు. వారు గంజాం జిల్లా మనోహర్ గ్రామంలో నివసిస్తున్నారు. కూలీగా పనిచేయడానికి తనకు ఏమాత్రం బిడియంగా లేదని పాత్రో అంటున్నారు. తనకు బోధన అంటే ఇష్టమని.. ఎవరు ఏమనుకున్నా పేదపిల్లల కోసం కూలీ పని చేస్తూనే ఉంటానన్నారు.
తాను చేస్తున్న ఈ పనికి ప్రేరణ ఏంటని పాత్రోను ప్రశ్నించగా.. చదువుకోవడానికి తాను పడ్డ కష్టాలేనని చెబుతున్నారు. తన తండ్రి గతంలో గొర్రెలకాపరిగా ఉండేవారని.. దీంతో కుటుంబం గడవడం కూడా కష్టంగా ఉండేదన్నారు. దీంతో 2006లో తాను హెచ్ఎస్సీ పరీక్షకు హాజరుకాలేకపోయానని తెలిపారు. కానీ, చదువుపై ఉన్న మక్కువతో దూరవిద్య ద్వారా 2012లో 12వ తరగతి పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యారు. తర్వాత డిగ్రీ పూర్తిచేశారు. అనంతరం బరంపూర్ విశ్వవిద్యాలయం నుంచి పీజీ పట్టా అందుకున్నారు. చదువుకు అయ్యే ఖర్చును రాత్రివేళ కూలీగా చేస్తూనే సమకూర్చుకున్నారు. పేద పిల్లలెవరూ చదువుకోవడానికి తనలా కష్టపడొద్దనే కోచింగ్ సెంటర్ను ప్రారంభించానని పాత్రో తెలిపారు.
ఈ మధ్య రైల్వే స్టేషన్లలో ట్రాలీ బ్యాగ్లు, ఎస్కలేటర్లు విరివిగా వినియోగిస్తున్నారని పాత్రో తెలిపారు. దీంతో కూలీల ఆదాయం పడిపోయిందన్నారు. ఈ నేపథ్యంలో కష్టపడి పనిచేస్తున్న రైల్వే కూలీల కోసం ఏదైనా చేయాలని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ను కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
70 ఏళ్లలో తొలిసారి.. తుంగభద్ర క్రస్ట్ గేట్ల పటిష్ఠత పనులు
తుంగభద్ర జలాశయం క్రస్ట్ గేట్లను మరింత దృఢంగా మార్చే పనులు చురుగ్గా సాగుతున్నాయి. -
ధూమపానంతో లోపాల పిల్లలు!
అనారోగ్యకర జీవనశైలితోపాటు ధూమపానం, మద్యపానం, ప్రాసెస్డ్ ఆహార వినియోగం, సెల్ఫోన్ విపరీతంగా వాడటం వంటి అలవాట్లతో శుక్రకణాల (స్పెర్మ్) డీఎన్ఏ దెబ్బతినే ప్రమాదం ఉందని దిల్లీలోని ఎయిమ్స్ వైద్య నిపుణులు పేర్కొన్నారు. -
మన ఓటింగ్ వ్యవస్థను తక్కువ చేయొద్దు
జనాభా తక్కువగా ఉన్న దేశాలతో మన ఎన్నికల ప్రక్రియను పోల్చడం సరికాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. బ్యాలెట్ ఓటింగ్ పద్ధతి వల్ల ఎదురయ్యే సమస్యలను ప్రస్తావిస్తూ గతంలో రిగ్గింగ్ వంటి అక్రమాలు జరిగిన విషయం తెలుసునని పేర్కొంది. -
భారత ఎన్నికలను ఆసక్తిగా గమనిస్తున్నాం: జర్మనీ
భారత సార్వత్రిక ఎన్నికలను తాము ఆసక్తిగా గమనిస్తున్నట్లు జర్మనీ తెలిపింది. ప్రపంచంలోని ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య పండగ ప్రక్రియను గౌరవిస్తున్నట్లు పేర్కొంది. -
నేను అరవింద్ కేజ్రీవాల్ను.. ఉగ్రవాదిని కాదు
తిహాడ్ జైలులో అధికారులు, భాజపా తనతో ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశ ప్రజలను ఉద్దేశించి మంగళవారం ఓ సందేశాన్ని పంపారు. -
మంచుగడ్డలపై యోగా
చైనాలో భారతీయుడి యోగాసనాలు విస్తృత ప్రాచుర్యం పొందుతున్నాయి. ఐక్యరాజ్య సమితి చైనా విభాగానికి నేతృత్వం వహిస్తున్న సిద్దార్థ ఛటర్జీ.. సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలో దట్టమైన మంచులో వేస్తున్న కఠినమైన యోగాసనాలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి. -
పారిశ్రామిక మద్యంపై నియంత్రణ కేంద్రానిదే
పారిశ్రామిక మద్యంపై నియంత్రణాధికారం కేంద్ర ప్రభుత్వానిదేనని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మంగళవారం స్పష్టం చేశారు. దేశ ప్రయోజనాల రీత్యా సంపూర్ణ అధికారం అంశాన్ని పారిశ్రామిక (అభివృద్ధి, నియంత్రణ) చట్టం-1951 ద్వారా పొందుపరిచారని వివరించారు. -
సల్మాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనలో ఇద్దరు నిందితుల అరెస్ట్
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కాల్పుల ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం రాత్రి వారిని గుజరాత్లోని కుచ్ జిల్లా మాతా నో మద్ గ్రామంలో అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. -
కోర్టు వెలుపలి నేర అంగీకారాలు బలహీన సాక్ష్యాధారాలే
న్యాయస్థానం వెలుపల నిందితులు చేసే నేర అంగీకారాలు స్వభావ రీత్యా బలహీనమైన సాక్ష్యాలే అవుతాయని సుప్రీంకోర్టు తెలిపింది. బలమైన సాక్ష్యాలను సమర్థించేవిగా మాత్రమే అవి ఉంటాయని పేర్కొంది. -
12వ తరగతి తర్వాత మూడేళ్ల ఎల్ఎల్బీ కోర్సుకు అనుమతివ్వాలి
ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి తర్వాత నేరుగా మూడేళ్ల లా కోర్సు (ఎల్ఎల్బీ) చదివేందుకు అవకాశం ఉండాలని అభ్యర్థిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రస్తుతం... డిగ్రీ పూర్తి చేసిన వారు మూడేళ్ల లా కోర్సులో, ఇంటర్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులైన వారు అయిదేళ్ల లా కోర్సులో చేరడానికి అర్హులు. -
సంక్షిప్త వార్తలు(6)
అరేబియా సముద్రం పశ్చిమ ప్రాంతంలో 940 కిలోల నిషేధిత మాదకద్రవ్యాలను భారత నౌకాదళం స్వాధీనం చేసుకుంది. భారత నౌకాదళంలో మెరికల్లాంటి మార్కో కమాండోలు ‘క్రిమ్సన్ బరాకుడా’ ఆపరేషన్లో భాగంగా ఓ పడవ నుంచి గత శనివారం మాదకద్రవ్యాలను పట్టుకున్నారని నౌకాదళ ప్రతినిధి ఒకరు వివరించారు. -
నేను ఏ పార్టీకీ ప్రచారం చేయలేదు.. అది నకిలీ వీడియో: ఆమిర్ ఖాన్
ఓ రాజకీయ పార్టీ తరఫున తాను ఎన్నికల ప్రచారం చేసినట్లు నెట్టింట్లో వైరల్ అవుతున్న వీడియో నకిలీదని బాలీవుడు నటుడు ఆమిర్ ఖాన్ తెలిపారు. -
బస్తర్కు హెలికాప్టర్లలో పోలింగ్ సిబ్బంది
లోక్సభ ఎన్నికల్లో ఈ నెల 19న తొలివిడత పోలింగు జరగనున్న రాష్ట్రాల్లో నక్సలైట్ల ప్రభావం ఎక్కువగా ప్రాంతాలకు కట్టుదిట్టమైన భద్రత నడుమ పోలింగ్ సిబ్బందిని హెలికాప్టర్లలో తరలించే ప్రక్రియ మంగళవారం మొదలైంది. -
అయోధ్య రాముడికి నేడు సూర్యతిలకం
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా బుధవారం అయోధ్య రాముడి నుదుటన సూర్య కిరణాలు ప్రసరించనున్నాయి. ఆలయ మూడో అంతస్తు నుంచి గర్భగుడిలోకి అద్దాలు, కటకాలతో కూడిన సాంకేతిక యంత్రాంగం సాయంతో ఈ ‘సూర్య’తిలకం ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. -
అల్లోపతి వైద్యాన్ని కించపరిచారో జాగ్రత్త
ప్రజలను తప్పుదారి పట్టించే ప్రకటనల కేసులో యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఆయుర్వేద సంస్థ ఎండీ బాలకృష్ణపై మరోసారి సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘కోర్టు ఉత్తర్వులను గతంలో మీరెలా అవహేళన చేశారో మాకు తెలుసు. -
న్యాయప్రక్రియకు ఆటంకం కలిగించే చర్యలు తీసుకోలేం
న్యాయ ప్రక్రియలో, న్యాయస్థానాలకు సంబంధించిన అంశాల్లో జోక్యం చేసుకొనే చర్యలను తాము తీసుకోలేమని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. -
మావోయిస్టుల సమాచారం ఇస్తే రూ.5 లక్షల బహుమతి
ఛత్తీస్గఢ్లోని కబీర్ధామ్ జిల్లాలో మావోయిస్టులకు సంబంధించిన సమాచారం ఇస్తే.. రూ.5 లక్షల నగదుతో పాటు, ఉద్యోగం కల్పిస్తామని అక్కడి పోలీసులు మంగళవారం ప్రకటించారు. -
హేమామాలినిపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. సుర్జేవాలాపై ఈసీ చర్యలు
హేమామాలినిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేత రణ్దీప్ సింగ్ సుర్జేవాలాపై 48 గంటలపాటు ప్రచారంలో పాల్గొనకుండా ఎన్నికల సంఘం (Election Commission) నిషేధం విధించింది. -
ఇంటర్వ్యూ వేళ తల్లి మృతి.. బాధను దిగమింగి.. ‘సివిల్స్’లో రెండో ర్యాంకు
ఇంటర్వ్యూ సమయంలో తల్లిని కోల్పోయిన బాధను దిగమింగి.. సివిల్స్లో దేశంలోనే రెండో స్థానంలో నిలిచాడు. అదీ తొలి ప్రయత్నంలోనే. అతడే ఒడిశాకు చెందిన అనిమేశ్ ప్రధాన్ (24).