Crime News: తల్లిదండ్రుల అమానుషం.. ఆడపిల్ల అని పాతిపెట్టేశారు!

తల్లిదండ్రులు అన్న మాటకే మాయనిమచ్చలా వ్యవహరించారు ఆ భార్యాభర్తలు. పుట్టింది ఆడపిల్ల అని తెలిసి ఆ పసికందును అమానుషంగా భూమిలో పాతిపెట్టేసి వెళ్లిపోయారు. అదే సమయంలో అటువైపు వెళ్లిన ఓ రైతు ఇది గమనించి ఆ బిడ్డను బయటకు

Updated : 06 Aug 2022 07:36 IST

ల్లిదండ్రులు అన్న మాటకే మాయనిమచ్చలా వ్యవహరించారు ఆ భార్యాభర్తలు. పుట్టింది ఆడపిల్ల అని తెలిసి ఆ పసికందును అమానుషంగా భూమిలో పాతిపెట్టేసి వెళ్లిపోయారు. అదే సమయంలో అటువైపు వెళ్లిన ఓ రైతు ఇది గమనించి ఆ బిడ్డను బయటకు తీసి కాపాడారు. అనంతరం చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. గుజరాత్‌లోని గంభోయ్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన పోలీసులు చిన్నారి తండ్రి శైలేశ్‌, తల్లి మంజును అరెస్ట్‌ చేశారు. నిందితులు గాంధీనగర్‌కు చెందినవారు. శిశువు బొడ్డు కూడా ఇంకా ఊడలేదు. మానవతావాదులను కలచివేసే ఈ ఘటన పట్ల పలువురు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని