సచిన్‌ వాజే గురించి అప్పుడే హెచ్చరించా!

ముంబయి పోలీసు అధికారి సచిన్‌ వాజే వల్ల మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వానికి సమస్యలు ఎదురవుతాయని తానెప్పుడో హెచ్చరించానని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ తెలిపారు. వాజే ఉదంతం

Published : 29 Mar 2021 16:42 IST

శివసేన ఎంపీ సంజయ్‌రౌత్‌ విమర్శలు

ముంబయి: ముంబయి పోలీసు అధికారి సచిన్‌ వాజే వల్ల మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వానికి సమస్యలు ఎదురవుతాయని తానెప్పుడో హెచ్చరించానని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ తెలిపారు. వాజే ఉదంతం మహా వికాస్‌ అఘాడీ ప్రభుత్వానికి మంచి పాఠం నేర్పిందని అన్నారు. 

ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ ఇంటి సమీపంలో పేలుడు పదార్థాల వాహనం కేసులో అరెస్టయిన సచిన్‌ వాజే.. ప్రస్తుతం ఎన్‌ఐఏ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఓ టీవీ ఛానల్‌తో రౌత్‌ మాట్లాడుతూ.. ‘‘వాజేను మళ్లీ మహారాష్ట్ర పోలీసు శాఖలోకి తీసుకోవాలని అనుకున్నప్పుడే అతడి గురించి నేను పార్టీలోని కొందరు నేతలకు సమాచారమిచ్చా. అతడి ప్రవర్తన, పనితీరు వల్ల ప్రభుత్వానికి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించా.  నేను కొన్ని దశాబ్దాల పాటు జర్నలిస్టుగా పనిచేశా. అందువల్ల వాజే గురించి నాకు తెలుసు. ఒక వ్యక్తి స్వతహగా చెడ్డవాడు కాదు. కొన్ని సార్లు పరిస్థితులు అతడిని అలా మారుస్తాయి. అయితే వాజే ఉదంతం, తాజా వివాదాలు.. సంకీర్ణ ప్రభుత్వానికి మంచి పాఠం నేర్పాయి’’ అని చెప్పుకొచ్చారు. 

ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఎన్సీపీ నేత శరద్‌ పవార్‌ రహస్య భేటీపై వస్తున్న వార్తల గురించి అడగ్గా.. ‘‘అందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది? ప్రత్యర్థి పార్టీల నేతల చర్చలు మంచివే. వారి భేటీ గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు’’అని అన్నారు. ఇక ఎన్సీపీ నేత అనిల్‌ దేశ్‌ముఖ్‌ యాదృచ్ఛిక హోంమంత్రి అంటూ చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించగా.. ఆయనో జెంటిల్‌మన్‌ అంటూ సమాధానం దాటవేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని