Harbhajan Singh: తల్లితో భగవంత్‌ ఉద్విగ్న క్షణాలు.. ట్వీట్ చేసిన భజ్జీ

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఆ పార్టీ తరఫున భగవంత్ మాన్‌ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Published : 12 Mar 2022 01:22 IST

చండీగఢ్‌: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఆ పార్టీ తరఫున భగవంత్ మాన్‌ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కాగా, మాన్ విజయం ఆయన తల్లిని అమితానందానికి గురిచేసింది. ఆయన్ను అభినందిస్తూ.. ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఆ అపూర్వ క్షణాల్లో తీసిన చిత్రాన్ని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ నెట్టింట్లో షేర్ చేసి, కాబోయే ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేశారు. 

‘పంజాబ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీకి శుభాకాంక్షలు. నా స్నేహితుడు భగవంత్‌ మాన్ ఇప్పుడు కొత్త మఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. భగవంత్ సింగ్ గ్రామమైన ఖత్కర్‌కలాన్‌లో ప్రమాణ స్వీకారం చేయాలనుకుంటున్నారని విన్నాను. ఇది మంచి విషయం’ అని ట్వీట్ చేశారు. అలాగే ఆ తల్లీకుమారుల అనుబంధం చూసి.. ‘అద్భుతమైన చిత్రం. ఆ తల్లికిది గర్వకారణం’ అంటూ రాసుకొచ్చారు. 

పంజాబ్‌లో 117 అసెంబ్లీ స్థానాలకు గానూ ఆప్‌ ఏకంగా 92 స్థానాలను కొల్లగొట్టింది. ఈ పార్టీ ధాటికి కాంగ్రెస్‌, అకాలీదళ్‌లోని దిగ్గజనేతలంతా ఇంటి బాటపట్టారు. తనకు, ఆప్‌కు ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు భగవంత్ కృతజ్ఞతలు తెలియజేశారు. దానికి సంబంధించిన వీడియోను షేర్ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు